27, జులై 2020, సోమవారం

పున్నమి తెలుగు దినపత్రిక వారు నిర్వహించిన"నల్ల సూరీడు నెల్సన్ మండేలా"అనే కవితాంశం పై నేను రాసిన కవిత ఇది.ప్రశంసా పత్రం కూడా..

*పున్నమి దినపత్రిక (సాహితీ డెస్క్)*వారు నిర్వహిస్తున్న "భారతరత్న నెల్సన్ మండేలా"
అంశంపై, నెల్సన్ మండేలా ఈ- కవితా సంకలనం కోసం నేను రాసిన కవిత..
అంశం:-భారత రత్న నెల్సన్ మండేలా
కవితా శీర్షిక:- శాంతి చేసిన సమరం.. నెల్సన్ మండేలా..
కవి:-లిఖిత్ కుమార్ గోదా,
        ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం.
______________________________
చిమ్మచీకట్లో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న
వర్ణ వివక్షను వేలెత్తి ప్రశ్నించిన భానుడు.,
శాంతిని ఆభరణములా, మౌనాన్ని ఆయుధంగా,
శ్వేత వర్ణ రిపుల ఎదుట "చిరునవ్వుని" అస్త్రంగా,
ప్రయోగించిన అపర శాంత సమరయోధుడు.
మహాత్మా గాంధీకి అనుచరుడు,
అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి
ఎందరో గుండె ధైర్యం గల ఉద్యమకారుల మోనిస్,
దాదాపు ముప్పది ఏళ్లు 
శాంతియుతంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా
జైలు గోడలతో ముచ్చటించిన ఉద్యమ కిరణం.
అతని శాంతి, అపార పోరాటం
ప్రపంచంలో ఎందరో నల్లజాతీయుల సంకెళ్లను బానిసత్వాన్ని తెంపింది.,
భారతరత్న, నోబుల్ శాంతి బహుమతి లు వంటి ప్రపంచం అంతటా కీర్తి గాంచి,
ఎన్నో మహోన్నత గౌరవాలు అందుకున్న మహాశయుడు.

నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక వెన్నెల సాహిత్య పేజీలో ప్రచురించబడిన నా కవిత...
91వ రచనా ప్రచురణ
నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక
(వెన్నెల సాహిత్య పేజీ)
21.09.2020
__________________________
హామీ పత్రం:-
ఈ కవిత పున్నమి సాహితీ డెస్క్ కోసం రాసిన కవితని, ఎక్కడా ప్రచురించలేదని, ఎక్కడ కాపీ కొట్టే లేదని దేనికి అనుకురణ కాదని, ఏ రచనకు అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.

కవి:-లిఖిత్ కుమార్ గోదా
ఊరు:-బనిగండ్లపాడు గ్రామం,ఖమ్మం జిల్లా-507202.
ఫోన్:-9949618101

https://drive.google.com/file/d/1CfRIy1LMhhaeo-3987k6l6jgBtAv7tvH/view?usp=drivesdk

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...