30, నవంబర్ 2020, సోమవారం

సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కవితా ప్రక్రియ పదబాణీ-3 విజేతలలో నేను ఒకడిని..

 సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కవితా ప్రక్రియ పదబాణీ-3 కవితా పోటీలో నన్ను కూడా విజేతగా నిలిపినందుకు నిర్వాహకులకు మరియు అడ్మిన్ గార్లకు ధన్యవాదాలు.. 

ఫలితాలు...
#పదబాణీలు
రూపకర్త:- చెన్నా సాయి రమణి గారు

 # కవిత్వం #

కన్నుల్లో
కన్నీరే
కరుణే
కోవెల్లో
కోనేరే
కైతౌను
(కవిత్వం)

💥💥దీపాల దీపావళి💥💥

దుష్టుల్ని
దహించే
ధైర్యంగా
దివంతా
దీపాల
దండిగా
(దివ్యంగా).

🌿🌿🌿🌿🌿
✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202
ఫోన్:- 9949618101

#బాటసారులకు నమస్కారం 🙏.

#పదబాణీ -3వ కవితాపోటీని విజయవంతం చేసిన ప్రతి బాటసారికీ ప్రత్యేకంగా ధన్యవాదములు🌹🎉.

#నూతన విధానమైననూ మీరందించిన ప్రోత్సాహం, కార్యక్రమాన్ని నడపడానికి కావాల్సిన అభిమానం అందజేసిందనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. 
ఈ ప్రయత్నాన్ని ఇలాగే విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. 
ఇక 
#విభిన్న కోణాలలో మీరందించిన
#పదబాణీలలో 
#మాకు ఉన్న పరిమిత పరిజ్ఞానంతో క్రింద కనబరిచిన పదబాణీలను #విజేతలను ఎన్నుకోవటం జరిగింది 
నిజం చెప్పాలి అంటే అందరూ అద్భుతంగా రాసారు 
విజేతలను ఎన్నుకోవాలి కాబట్టి ప్రకటిస్తున్నాము .
చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల #కొద్దిమంది విజేతలుగా నిలవలేకపోయారు. 
ఇక విజేతల వివరాలకు వస్తే 

#పదబాణీల విజేతలు.. 
పదబాణి -3విజేతలు

1)లిఖిత్ కుమార్ గోదా గారు 
2)అప్పాశ్రీ గారు 
3)పిల్లి హజరత్తయ్య గారు 
4)కమలశ్రీ గారు 
5)విష్ణుప్రియ గారు 
6)డా. మరుదాడు అహల్యాదేవి గారు 
7)ఆనిరాజ్ కూచిపూడి గారు 

#సమీక్షలు 

#లిఖిత్ కుమార్ గోదా గారు 



కన్నుల్లో కన్నీరు గురించి చెబుతూనే కోవెల కోనేరు పవిత్రం లాంటిది కవిత్వమంటూ కవిత్వ స్వచ్చదనాన్ని తమదైన మాటలలో తెలిపారు. అభినందనలండి  

#అప్పాశ్రీ గారు 

బాలలు బ్రతుకు బీటబారితే భారత భవిష్యత్ ప్రశ్నర్థకమే సుమా అంటూనే తరువాత ఏంటి అని సమాజాన్ని ప్రశ్నిస్తూ.. ఆలోచనలో పడేసిన విధానం బాగుందండి. అభినందనలండి  

#పిల్లి హాజరత్తయ్య గారు 

చెడును, చీకటిని చెరిపే శక్తి చైతన్యంలో దాగుందని.. అందరిలో కదిలే చైతన్యంతోనే చీకటిని చెరిపేయచ్చునని హిత బోధ చేస్తూ.. చిత్రమే అంటూ ఆలోచనలో పడేసే తీరు బాగుందండి. అభినందనలండి 

#కమలశ్రీ గారు 

నారాణి నాహృదయ నివాసమే అంటూ నీకోసం నీలాల నింగికి నిచ్చెన వేస్తా అంటూ చెప్పే విధానం బాగుందండి. అభినందనలు 

#విష్ణుప్రియ గారు 

వేకువ విరబోయటం వనితకు వరమవుతుందని ఆ వరం ముంగిట వచ్చి వాలుతుందని అనటం బాగుందండి. అభినందనలండి 

#డా. మరుదాడు అహల్యాదేవి గారు 

సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో 
కరుణను కురిపిస్తూ కృపా దృష్టితో కాపాడమని జగతిని కాపాడె జగజ్జననైన కామాక్షిమాత కు విన్నవించుకునే విధానం బాగుందండి. అభినందనలండి 

#ఆనిరాజ్ కూచిపూడి గారు 

బేధభావాలను విడిచి జీవితాన్ని సాగించు అంటూనే బ్రదిమి బుడగ లాంటిదని వైషమ్యాలు విడిచి ఎఱుకతో ఆనందంగా జీవించమని చెప్పే విధానం బాగుందండి. అభినందనలండి 

#నియమాలు అనుసరించి చక్కని భావాలను కూర్చి చేర్చి పదార్చన చెయ్యండి విజేతలుగా నిలవండి. 

మీ ఆత్మీయ సోదరి 

కుమారి చెన్నా సాయిరమణి 

కవితాలయం 

ధన్యవాదములు 🙏🙏🙏

కవికులం ఫేస్బుక్ గ్రూపు వారు నిర్వహించిన నానీల పోటీ (21 వ పోటీ) కోసం నేను రాసిన నానీలు

👉👉 అంగవైకల్యం👈👈


1)అంగవైకల్యం
దేహానికే ...!
సు(ఆ)లోచనలకు కాదు
కదా నేస్తమా!

2)సంకల్ప బలం
అంగవైకల్యంతో నైనా
అనూరుడిని, 
ఓ మిల్టన్ని చేస్తుంది..

3)నల్గురికి నువ్వే
ఆదర్శం
ఆత్మశుద్ధి నింపుకో
అంగవైకల్యం మర్చిపో..!

4)అంగవైకల్యం అని
జాలిచూపకు
చేతనైతే
ప్రోత్సహించు...!

5)శారీరకంగా
అంగవైకల్యమే
ఆత్మస్థైర్యం లో
అన్నింటా మిన్న...!

లిఖిత్ కుమార్ గోదా., ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

29, నవంబర్ 2020, ఆదివారం

ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువరించిన బాలల హక్కుల పరిరక్షణ అనే అంశంపై నేను రాసిన మినీ కవిత...

 ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువరించిన బాలల హక్కుల పరిరక్షణ అనే అంశంపై నేను రాసిన మినీ కవిత...

సహకరించిన ఆత్మీయులు శ్రీ ఆత్రం మోతిరామ్ అన్నయకి, జాదవ్ బంకట్ లాల్ గారికి,ఇతర కార్య నిర్వాహకులకు నా మనః పూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు...

గమనిక:నియమాలను పరిశీలించగలరు

*ఉ.సా.వే ద్వైమాసిక(అక్టోబర్-నవంబర్) సాహితీ అంతర్జాల సంచిక:*

*● మినీ కవితలు ఆహ్వానం:●*

*అంశం:బాలల హక్కుల పరిరక్షణ-మన కర్తవ్యాలు*

*నియమాలు:-*
★ *మినీ కవిత 10 వరుసలు మాత్రమే ఉండాలి.*

*●మీ మినీ కవిత పంపే విధానం:*

*1.కవిత శీర్షిక:* ××××××××××××××××××××××
*2.కవిత (10 వరుసలు)* 
1.×××××××××××××××××××××
2.×××××××××××××××××××××
3.×××××××××××××××××××××
4.×××××××××××××××××××××
5.×××××××××××××××××××××
6.×××××××××××××××××××××
7.×××××××××××××××××××××
8.×××××××××××××××××××××
9.×××××××××××××××××××××
10.××××××××××××××××××××
*పేరు:××××××××××××××××*
*చిరునామా:××××××××××××*
*సెల్:0000000000*
3..ఫొటో 👤
5.హామీ పత్రము(పేపర్ పై రాసి ఫొటో తీసి పంపాలి)
★ఫొటోకు అనుసంధానం చేస్తూ మీ పేరు రాయాలి.
*:! గమనిక:-*
*-ఉసావే నియమాలను పాటిస్తూ కవితలు రాయవలెను.:!/నియమాలను నిర్లక్ష్యం చేస్తూ మీ కవితలు ఉంటే స్వీకరించబడవు.:!*

*చివరి తేది:11.11.2020,నుండి 13.11.2020 మధ్యాహ్నం 12:00 గంటల వరకు.*

*ఈ క్రీంది వాట్సప్ లింక్ లో ప్రవేశం పొంది మినీ కవిత పంపవలెను*










ఉసావే ధ్వైమాస పత్రిక

అంశం:- *బాలల హక్కుల పరిరక్షణ... మన కర్తవ్యం*


కవితా శీర్షిక:- *కదలాలి బాలల హక్కుల కోసం*


మనమంతా చేతిలో చెయ్యేసి కదిలితేనే
బొబ్బలు పండిన బాలల చేతులకున్న
బానిస శ్రామిక లోక సంకెళ్లు విరిగిపడేది.
కన్నీళ్లను తుడిచి,
బాలల హక్కులకు విలువిచ్చి బాధ్యతాయుతంగా పోరాడాలి,
చెమటతో తడిచిన దేహాల నుండి
పట్టిన పలుగు పార విసిరేసి,
చదువులమ్మ ఒడిలో చేర్చాలి మనమంతా.
బాలల హక్కులను గౌరవించే మన చేతులే
రేపు నవ్య దేశాన్ని రూపొందించేది.

కవి:- _*లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం*_ మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.

*చిరునామా*:-
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507202

హరివిల్లు నూతన లఘు కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ మామిడి రమేష్ గారి తొలి హరివిల్లు పుస్తకం"అక్షర జలపాతాలు" పుస్తకంలో నేను రాసిన ముందు మాటలు...

  •  కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు



తరి
ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొలకలు, మొక్కలు ఉద్భవిస్తూ కవన పరిమళాలను, కిరణాలను వెదజల్లుతున్నాయి.
తెలుగు భాషా ఘనతను సుస్థిరంగా నిలపాలనే ఆశయంతో, కవిత్వాన్ని సాధారణ జనుల రసన వద్దకు తీసుకెళ్లి, కవిత్వంపై మక్కువ కలిగేలా చేసి, పాఠకులు సైతం కవి కావాలనే ఉద్దేశంతో, కవులు తమ సృజనకు పదును పెట్టి నూతన కవితా ప్రక్రియలకు పురుడు పోస్తున్నారు. "అచ్చంగా తెలుగు" ఇంపును, నుడికారాలను, అతి తక్కువ పాదాల్లో, మాత్రాఛందస్సును, అంత్య ప్రాస నియమం పాటించడం, అలంకారాలను కవిత్వంలో చొప్పించి చిక్కగా, తేనె చుక్కగా అందరూ రాయాలనే నూతన కవితా ప్రక్రియలకు శ్రీకారం చుడుతున్నారు రూపకర్తలు.
అలాంటి కొద్దిమంది కవుల్లో హరివిల్లు కవితా రూపకర్త శ్రీ మామిడి రమేష్ గారిని ఒకరని చెప్పుకోవచ్చు.

ఈమధ్యే రూపుదిద్దుకున్న కైతికాలు, మణిపూసలు, చిమ్నీలు, మెరుపులు వంటి నూతన కవితా ప్రక్రియల రుచిని చూసిన రమేష్ గారు తమ వంతు తెలుగు కవిత్వం కోసం, బడిలో చదువుకునే విద్యార్థుల నుండి, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కోసం ఈ హరివిల్లు ప్రక్రియను రూపొందించారు అని నా అభిమతం. అతి తక్కువ కాలంలోనే వాట్సప్ వేదికగా అన్ని వయసుల వాళ్లు కలిపి దాదాపు రోజుకు రెండు వందల మందికి పైగానే ఈ సమూహంలో హరివిల్లు కవిత్వం కురిపిస్తున్నారు. అతికష్టమైనా, ఎంతో శ్రద్ధతో వాళ్లల్లో విజేతలను ఎన్నుకుంటున్నారు నిర్వాహకులు.

ఈ "అక్షర జలపాతాలు" లోని హరివిల్లు కవనాలు ప్రతి ఒక్క చదువరిని కవిత్వంతో తడిపేస్తాయి. 160 హరివిల్లులతో అలంకరించిన ఈ వయ్యి సంపూర్ణంగా జనాదరణ పొందుతుందని ఆకాంక్షిస్తున్నాను. నాకున్న వీలునుబట్టి ఇందులోనే చిక్కని కవిత్వాన్ని మీ మదికి చేరవేసే యత్నం చేస్తాను.

" సహనశీలి మగువ
  సమరభేరి మగువ
  ఇంటి వెలుగు మగువ
  ఇలన కాంతి మగువ"(16)-
అంటూ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి మగువలు చేసిన పోరును, మగువలకు ఉన్న గొప్ప లక్షణాలను, ఒక్క హరివిల్లు లో పొందుపరిచారు.
" చలికి వణికి నపుడు
  చెద్దరగును అమ్మ
  అలసిపోయినపుడు
  ఊయలగును అమ్మ"(30)
- అంటూ అమ్మ అవ్యాజమైన ప్రేమ గురించి గొప్పగా వివరించారు.44వ హరివిల్లులో అటు కలియుగంలో జరుగుతున్న నిజాన్ని తెలియపరచి, అమ్మ దివ్యమైన గొప్పతనాన్ని చాటి చెప్పారు.
"
  
  మాట చెలిమినిచ్చు
  మాట కలిమినిచ్చు
  మాట సమత నిచ్చు
  మాట మమత నిచ్చు"(67)
 మాట ఎంత మహత్తరమైన కార్యాలను చేయగలదో, ఎంతటి ప్రేమానురాగాలను కురిపించగలదో వివరించారు.

" మాతృ భాష లోని
  మకరందం వీడకు
  పరుల భాష యొక్క
  పంచన చేరకు!"(84)
అంటూ మాతృభాషలోని ప్రేమానురాగాలను భోధిస్తూనే, పరుల భాష చెంత చేరకు అని, పరభాష నేర్చుకోవడం వరకేనని చదువరులకు చెబుతున్నారు.

నాన్న ఆప్యాయత, గురువు విశిష్టత, చెలిమి, చెట్టు విశిష్టతలు వెల్లడించారు కవి అపురూపంగా.

"నొసటి రాత రాయు
అసలు బ్రహ్మ ఓటు
  బతుకు బాగు చేయు
  బల సూత్రం ఓటు!"(102)
- అంటూ ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూనే, రాజకీయవేత్తలు ఎంత జిత్తులమారులో,కుటిల బుద్ధిగలవారో,కుంటి సాకులు వినిపిస్తారో తరువాతి హరివిల్లు కవితల్లో చూపించారు.

దేశానికి అమ్మై అన్నం అందించే రైతన్న గురించి-
" మెతుకులిచ్చు వాడు
  చతికెలపడే నేడు
  అతీగతీ లేక
  చితికి చేరెను చూడు!" (113)
అంటూ తన కవి హృదయ వేదనను కవిత్వకరించారు కవి.

"మనిషి పైన చేసే
 మారణ హేలల దాడి
 మందుగిందు లేని
 కరోనా మాయలేడి"-(119)


ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధంగా మారిన కరోనా మహమ్మారి పై తన క(ల)రవాలాన్ని సంధించారు.

ఆస్వాదించాలే కానీ ఇందులోని నూట అరవై కవితలు ప్రతి పాఠక ప్రియుడిని తేనె టీగలా మార్చి "హరివిల్లుల మకరందాన్ని" రుచి చూపించగలవు.
మానవత్వం,సమాజ హితం, నడకను, ఆలోచనా శక్తిని, విలువల్ని, విచక్షణని, మానవీయ బంధాలు ఇలా మానవ జీవితంలో ఆవశ్యమైన ప్రతి విషయాన్ని తీసుకుని అతి తక్కువ పదాలతో, పాదాలతో చక్కని కవిత్వాన్ని రాసి పాఠక లోకానికి అందించడంలో కవి సఫలీకృతులయ్యారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కవి రమేష్ గారు మున్ముందు నిత్య నూతనమైన హరివిల్లుల కవిత్వాన్ని తెలుగు పాఠకు ప్రియుల అరచేతుల్లోకి తీసుకెళ్లి వారి హృదయ గ్రంథాలయంలో జీవించ గలరని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మనోరంజక పుస్తకాన్ని వెలువరించిన రమేష్ గారికి అభినందనలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ఫోన్:- 9949618101

27, నవంబర్ 2020, శుక్రవారం

ఆత్మీయులు, గురువులు శ్రీ పోతగాని సత్యనారాయణ గారు, దేవయ్య యనుగందల గారు నేర్పించిన రుబాయిలు తొలి ప్రయత్నంగా...

 రుబాయీలు

రుభాయీలో నాలుగు పాదాలుంటాయి.

మూడవ పాదానికి తప్ప మిగతా పాదాలకు ఖాఫియా,రదీఫ్ లను పాటించాలి. లేదా అంత్యప్రాసతోనైనా రాయవచ్చు. 

ప్రతిపాదంలోనూ సమానమైన మాత్రల సంఖ్య ఉండాలి.
అయితే అత్యధికంగా ఇరవై తొమ్మిది మాత్రలకు మించకుండా,తక్కువలో తక్కువ పదిహేను మాత్రలకు తగ్గకుండా ఉంటే మంచిది.


నాకోసం నేనైతే కవిత్వాన్ని రాయలేను
నాలోకం వేరంటూ జీవితాన్ని గడపలేను
ఒక్కరోజు కవి లాగా జీవించాలని ఉన్నది
అక్షరాలే పేర్చి నేను తవికల్ని రాయలేను!(01)


అవ్యాజపు కన్నులతో నవ్వేది బాల్యమే
నేలమీద గీతగీసి ఆడేది బాల్యమే
ఇసుకతోన భవనాలను నిర్మించే పాపలు
వయస్సు పెరిగే కొద్దీ తరిగేది బాల్యమే!(02)

కథల్లో సద్గుణాలు వెతుక్కునే వయసది
దుష్ట కార్యాలను చీదరించుకునే వయసది
చెట్టు పైన కపిలాగ ఆటలాడు నేస్తాలు
ప్రేమానురాగాలను పెంచుకునే వయసది!(03)

కోవెలలో కంచురవళి పసి మనసుల నవ్వులు
తోటలోన పరిమళించు పొన్నారుల నవ్వులు
శక్తి లేని ముదుసళ్ళు కోరేదీ బాల్యమే
జగతినే మోహనపరుచు చిన్నారుల నవ్వులు!!(04)

లిఖిత్ కుమార్ గోదా.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం


22, నవంబర్ 2020, ఆదివారం

స్వర్గీయులు ప్రముఖ సాహితీవేత్త రెడ్డి నాగరాజు వేంపల్లి గారు రచించిన "పాల బుగ్గలు పసిడి మొగ్గలు" పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 

నీతి కథల చిట్టడవి... రెడ్డి నాగరాజు"పాలబుగ్గలు పసిడి మొగ్గలు"(పుస్తక సమీక్ష)

పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




    భిన్న సాహితీ ప్రక్రియలయిన కథ, కవిత్వం, నాటకం, వ్యాసం, విమర్శ, సమీక్ష వంటి అంశాలలో కొందరు సాహితీవేత్తలు ఏదో ఒక ప్రక్రియలో మాత్రమే రచనలు సాగించి లబ్దప్రతిష్టులు అవుతారు. అయితే వీరిలో కొంతమంది మాత్రం దాదాపు అన్ని ప్రక్రియలతో ప్రవేశం కలిగి సాహితీ ప్రియులను అలరించడం ద్వారా విశ్వవిఖ్యాతులవుతారు.
ఈ కోవలోకి వచ్చే వారు అక్కడక్కడా చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తారు. వీరిలో అన్ని సాహితీ ప్రక్రియలతోనూ సంబంధం కలిగి రచనలు చేస్తున్న సాహితీవేత్తగా వేంపల్లి రెడ్డి నాగరాజు గారిని పేర్కొనవచ్చు.


గత మూడు దశాబ్దాల కాలంగా పైన పేర్కొన్న అన్ని సాహితీ ప్రక్రియలలో పయనిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సాహితీ ప్రియులను అలరిస్తున్న రచయితగా నాగరాజు గారిని పేర్కొనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
తన కలాన్ని ఆకారం లో చిన్నదైనా ఒక ఎడారి రోజా చేసుకుని, గుత్తులు గుత్తులుగా సాహిత్యాన్ని పూయించాలనే ఆశ రెడ్డి నాగరాజు గారిది. తన సూక్ష్మ లిఖితాలతో ఎడారి లాంటి ఈ జగతిలో తనొక ప్రత్యేకం కావాలని కొత్త ఒరవడితో, వ్యూహాలతో మినీ కథలు, మినీ కవిత్వాలు వంటి రచనలు చేశారు.

 ప్రత్యేకించి బాల సాహితీవేత్తగా బాలల కోసం రాసే కథలలో గతంలో ఎవరూ చేయని వినూత్న ప్రయోగాలు చేయడం ద్వారా ఈ రచయిత తనదైన పేరును సొంతం చేసుకున్నారు. "రూపాయికి ఒక కథ" అంటూ దాదాపు లక్ష కాపీలు దాకా అమ్మారు. బాలసాహిత్యంలో ఈ-తరం బాలల కోసం "కొత్తబాట"ను నిర్మించారు. పిల్లల కోసం "బామ్మలు చెప్పని కథలు, బొమ్మలు చెప్పిన కథలు, గోరుముద్దలు, నవతరం బాలల నీతి కథలు"వంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరు రాసిన బాలల కథలను ఆంగ్లంలోకి అనువదించి రెయిన్బో నామంతో ఒక పుస్తకాన్ని వెలువరించారు ప్రముఖ రచయిత్రి బి.ఎస్. పద్మావతి. అలా వారి కలం నుండి జాలువారిన కథాశిల్ప సంపుటి "పాల బుగ్గల -పసిడి మొగ్గలు".

ఈ పుస్తకం నేటితరం పిల్లలకు దొరికిన "అక్షరాల పాలపుంత" అనుకోవచ్చు. ఇందులోకి పిల్లని ఒక్కసారి చేర్చితే వారు నీతులతో దేహాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు.
మొత్తం రెండు చేతులకి ఉన్న వేళ్లను కలిపితే ఇందులోని కథలు సంఖ్య. పుస్తకంలోని కథలు ఒక్కొక్కటి ఒక్కొక్క తరహాలో నడుస్తూ, పాతదానికి కొత్త రూపును చేర్చి, రసగుల్లల్లా కొత్త రుచులు చూపిస్తూ, పంచతంత్రాలను నవతంత్రాలుగా మార్చి నోరూరిస్తాయి.

యుక్తి కథలో మనకు తెలిసిన పంచతంత్ర కథ అయినా "ద్రాక్ష నక్క"ను తీసుకుని అందులో నక్క ద్రాక్షాల కోసం ఎదురు చూసే భాగం వరకు తీసుకుని తరువాత చమత్కార సృజనకు పదును పెట్టారు రచయిత. నక్క ద్రాక్ష పండ్ల కోసం చెట్టుక్రింద ఉండడం, ఒక కాకి చూసి ఏంటి ఎక్కడున్నావ్ అని అడగడం, పైన ఉన్న ద్రాక్ష పళ్లను పట్టుకుని ఊగితే స్వర్గం చూడవచ్చునని, అలా పులి స్వర్గం చూస్తాను స్నానం చేసి ఇప్పుడే వస్తాను అంటే ఇక్కడ కాపలా కాస్తున్నాను అని నక్క అనడం, నేను స్వర్గాన్ని చూస్తానని కాకి చెప్పడం, నక్క తొలుత కాదనడం, బ్రతిమాలగా ఒప్పుకోవడం, కాకి ద్రాక్షపండ్లను పట్టుకుని ఊగడం, అప్పుడు ద్రాక్ష పండ్లు రాలడం, నక్క ఆశ ఆకలి తీరడం, కాకి తిక్క కుదరడంతో కథ నవ్వులతో ముంచెత్తి కంచికి చేరుతుంది.
"శక్తి లేని చోట యుక్తితో ఎలా విజయం సాధించవచ్చు"నని చూపించిన కథ ఇది.

"నిజమైన గెలుపు" కథలో మనకు తెలిసిన కుందేలు తాబేలు కథనే తీసుకొని, అవి రెండు పోటీ పెట్టుకొని కుందేలు విశ్రాంతి తీసుకునే భాగందాకా తీసుకొని, తరువాత తాబేలు,కుందేలును నిద్రలేపి "గెలుపు దిశగా నడువు,విజయం సాధించాక కావాలంటే విశ్రాంతి తీసుకుందువు గాని" అని అనడంతో చదువరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
"పోటీదారులను ప్రోత్సహించడం కూడా గెలుపొందడంతో సమానం" అని నీతిని ఇచ్చే చక్కటి కథ.

ఏడుగురు రాజకుమారుల కథను "చేపల వేట" కథగా తీసుకొని పర్యావరణ హితాన్ని, చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు నేర్పించారు రచయిత వేంపల్లి నాగరాజు గారు.

మనకు పంచతంత్రం నుంచి తెలిసిన "ఆవు పులి కథ" (పుణ్యవతి కథ)ను తీసుకొని ముందుచూపు ఎంత గొప్పదో వివరించారు.

ఇలా దశ ఆణిముత్యాలతో ముస్తాబైన ఈ కథా సంపుటి బాలల మదిలోకి చేరవలసిన మంచి పుస్తకం. పిల్లల కోసం కొత్త తరహాలో కథలు రాయడంలో రచయిత రెడ్డి నాగరాజు గారు సఫలీకృతులయ్యారు. బాలసాహిత్యంలో ఇదొక నిత్యనూతన ప్రయోగమని చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి పుస్తకాన్ని మన కళ్ళల్లోకి తీసుకొచ్చిన రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారికి అభినందనలు. ఇటువంటి బాలల కథలు పెద్దలే చదివి పిల్లలచేత చదివించి వారిని నవభారతం వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే రచయితల ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
*నివాసం*:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.

ఫోన్:- 9949618101,7658980766


ప్రతులకు:- 
వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,
 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269
మొబైల్:- 7989928459,9985612167.


15, నవంబర్ 2020, ఆదివారం

సమ్మోహనాలు నూతన కవితా ప్రక్రియలో నేను రాసిన సమ్మోహన కవనాలు..

 




సమ్మోహనాలు నూతన కవితా ప్రక్రియ సృష్టికర్త శ్రీ నాగ మోహన్ యెలిశాల గారు


సమ్మోహనాల నియమాలు

************************

* మూడు పాదాలు
* మొదటి రెండు పాదాలకు అంత్యప్రాస
* మొదటి రెండు పాదాలకు పదేసి(10) మాత్రలు
* ముక్తపదగ్రస్త రీతి_
అనగా మొదటి పాదం చివరి పదం రెండవ పాదం మొదటి పదంగా, రెండవ పాదం చివరి పదం మూడవ పాదం మొదటి పదంగా మొదలవుతుంది
* మూడవ పాదానికి అంత్యప్రాస లేదు
* మూడవ పాదంలో (20 మాత్రలు) తొలి పదిహేను మాత్రలలో విషయాన్ని రూఢీ చేసి, తర్వాత ఐదు మాత్రలలో నామ ముద్రతో గానీ సంబోధనా పదంతో గానీ ముగించాలి.

ఉదా:

మనిషికుంటే మనసు
1 1 1 2. 2. 1 1. 1 ___10

మనసుకుంటే సొగసు
1 1. 1. 2. 2. 1 1 1. ___10

సొగసు కక్కరలేదు మైపూత 
1 1 1. 2 1 1 2 1. 2. 2. 1 __15

               మోహనా...
                2. 1. 2. ___5



**********************
            🌷 సమ్మోహనాలు 🌷
         **********************

తాత్వికా చింతనలు
చింతనా గాఢతలు
గాఢతలు మనసు పరిపక్వతలు మోహనా....!

వాస్తవం కఠినమై
కఠినమై జఠిలమై
జఠిలమై కుటిలాన్ని కూల్చేను మోహనా....!

రక్తాన్ని మరిగించి
మరిగించి రగిలించి
రగిలించి ద్వేషాన్ని పెంచకోయ్ మోహనా.....!

     📝 నాగమోహన్ 🎯

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦

సమ్మోహనాలు.





అక్షరాలను తూచి/
తూచి మదిలో దాచి/
దాచి జీవితమున పాటించెద
కుమారా!(1)


కవిత్వమును లిఖించి/
లిఖితాన్ని పలికించి/
పలికించి పాలించెద జగతిని
కుమారా!(2)


సంశయాలను వదిలి/
వదిలి ముందుకు కదిలి/
కదిలి జీవితమున కీర్తి పొందు/ కుమారా!(3)


నయనాలనే మూసి/
మూసి మదిలో (మనసున) చూసి/
చూసి మలినమునొదలగొట్టాలి/ కుమారా!(4)


తెలుగు భాషను కొలిచి/
కొలిచి నిరతము తలిచి /
తలిచి మన భాషనే కాపాడు కుమారా!(5)

అమ్మ సమ్మోహనాలు

మమతలను కురిపించి/
కురిపించి లాలించి/
లాలించి జగమేలు అమ్మలే కుమారా!(6)

బిడ్డకూపిరి పోసి/
పోసి గుండెలో మోసి/
మోసి సహనంతో తీర్చిదిద్దు కుమారా!(7)

భూమికి మణులు పూసి/
పూసి రైతులు మురిసి/
మురిసి ఆకలి కేకలు మాన్పెను కుమారా!(8)

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా!(9)

దర్జీకి ఉపకారి/
ఉపకారి సహకారి/
సహకారియై ఉపాధిని పంచు కుమారా!(10)




చీకటిని చెరిపేసి/
చెరిపి ముందడుగేసి/
అడుగుతో జీవితము నిర్మించు కుమారా/!(11)



ప్రకృతి తల్లిని కొలిచి/
కొలిచి మనసును పిలిచి/
పిలిచి నిజ సిరిని చూపించెదను కుమారా!/(12)



ఓడిన నరుల కేసి/
నరుని హేళన చేసి/
చేసి నువు సాధించునదియేమి కుమారా!/(13)

*పుస్తక సమ్మోహనాలు*
(14-20)

పుస్తకం తెరువగా/
తెరిచి మది చదువగా/
చదివి సత్యాన్ని తెలుసుకునులే కుమారా!/(14)

లోకాలు విహరించి/
విహరించి వివరించి/
వివరించి లోక హితమును నేర్పు(పలుకు) కుమారా!/(15)

మలినాన్ని తొలగించి/
తొలిగించి కదిలించి/
కదిలించి నేర్పించు జీవితము కుమారా!/(16)

పువ్వలా వికసించి/
వికసించి మురిపించి/
మురిపించి మనసు ద్వారం తెరుచు కుమారా!/(17)

పుస్తకతోవ నడిచి/
నడిచి మనసును పిలిచి/
పిలిచి జగతిని మోహన పరిచెద కుమారా!/(18)

అక్షరాలై పూచి/
పూచి మదినే తూచి/
తూచి సద్గుణాలు నింపునులే కుమారా!/(19)

అక్షర కోట కట్టి/
కట్టి మనసును పట్టి/
పట్టి స్వర్గమునే బంధించును కుమారా!/(20)


🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
​ అంతర్జాతీయ బాలికల (కూతుళ్ళ) దినోత్సవ సందర్భంగా)
పసిడి పలుకుల వాణి/
వాణి గృహముకు రాణి/
రాణై కుటుంబాన్ని ప్రేమించు కుమారా!/(21)

సహనమే అమ్మలా
అమ్మ కనుగవ్వలా
గవ్వలా సవ్వళ్ళ కూతుళ్ళు కుమారా!/(22)

*కలము సమ్మోహనాలు*(23-27)
📝📝📝✒️✒️✒️

కవులకు కలం గళం/
గళమే పోరు దళం/ 
దళమై అన్యాయాలెదురించు కుమారా!/(23)
      🖊️🖊️🖊️🖊️
అధర్మం సహించక/
సహించకది వదలక/
వదలక అక్షర నిప్పులు చిమ్ము కుమారా!/(24)
     ☝️☝️☝️☝️
భావాలు కురిపించు/
కురిపించి చదివించు/
చదివించి పాఠకుని మురిపించు కుమారా!/(25)
    ☝️☝️☝️☝️☝️
కవులకది గీర్వాణి/
గీర్వాణి మన వాణి/
వాణియై లోకాన్ని పాడించు కుమారా!/(26)
13.10.2020


*సమ్మోహనాలు*


కురిసేటి నైలాన్ని/
నైలాన్ని నైనాన్ని/
నైనాన్ని కాగితమున వాల్చితి కుమారా!/(27)
(నైలా=మేఘం
 నైనా=కళ్లు)

కైతలను రాసుకుని/
రాసినవి చదువుకుని/
చదివి ఏకాంతముగా మురిసితి కుమారా!/(28)


మాటల పోటు పొడిచి/
పొడిచి మనసులు విరిచి/
విరిచి నీవు హీనుడు కావొద్దు కుమారా!/(29)

*సైనికా.. దేశానికి సేవకా*
_ప్రక్రియ:-సమ్మోహనాలు_

సరిహద్దు నివాసం/
నివాసం సాహసం/
సాహసంతొ దేశము కాపాడె సైనికా!/(30)

కుటుంబాలను వదిలి/
వదిలి ముందుకు కదిలి/
కదిలి శత్రువుల చెండాడుదువు సైనికా!/(31)

తుపాకులు చేపట్టి/
చేపట్టి పడగొట్టి/
పడగొట్టి రిపులనోడించెదవు సైనికా!/(32)

మంచు కొండలు ఎక్కి/
ఎక్కి రిపులను తొక్కి/
తొక్కి పట్టి హతమార్చు మీరే సైనికా...!/(33)

మీరు వీరులయ్యా/
వీర మేనులయ్యా/
మేనంత దేశభక్తే కదా సైనికా!/(34)

సరిహద్దులో జవాన్/
జవాన్ దేశపు మహాన్/
మహానై ప్రాణాలనిస్తావు సైనికా!/(35)

బాంబులకు భయపడక/
భయమును రానివ్వక/
రానివ్వక జయ గీతము పాడు సైనికా!/(36)

చెట్టు కింద మగువలు/
మగువలూయలాటలు/
ఆటలతో పల్లెలు పరిమళించె కుమారా!(37)

చెట్టు తల పూలతో/
పూల జడి వానతో/
వాన మగువల ఎదలు వర్షించె కుమారా!(38)


గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా!(39)
(కేరింతలతొ బాలలాడుదురు కుమారా)

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలొ అలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!(40)

ప్రకృతి ఒడిలో ఆట/
ఆట కోకిల పాట/
పాటలతో పల్లె పులకరించె కుమారా/!(41)

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/(42).

21.10.2020


ఎదను గదిలో నెట్టి/
నెట్టి గొళ్ళెం పెట్టి/
పెట్టి స్వేచ్ఛను పోగొట్టుకోకు కుమారా!(43)
 
*సమ్మోహనాలు*

నవ్వులో పువ్వులో/
పువ్వులో పరుల్లో/
పరుల్లో కవనాలన్వేషణ కుమారా!(46)

బాధలను మరువుటకు/
మరువుటకు పెరుగుటకు/
పెరిగి విజేతగును కవిత రాసి కుమారా!(47)

కన్నీరు కవితగా/
కవితగా నడకగా/
నడిచి తమ బాధలు మరువు కవులు కుమారా/!(48)

బాధలో దైవాన్ని/
దైవాన్ని భావాన్ని/
భావాలే లిఖించు కవితలో కుమార్/!(49)

స్వప్నాలు రాసుకుని/
రాసినవి పంచుకుని/
పంచి మనల్ని ఆహ్లాదపరిచు కుమారా!(50)

తప్పులను ఖండించి/
ఖండించి ఎదురించి/
ఎదిరించి జీవించు కవితలో కుమారా!(51)


రోధించు కన్నులకు/
కన్నులకు మనసులకు/
మనసునకు ఔషధం కవనమే కుమారా!(52)

ఎదకు అమృతాంజనం/
అమృతపు ప్రభంజనం/
ప్రభంజనం పుట్టించు కవితే కుమారా/!(53)


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు బాలకవి/!(54)

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును బాలకవి/!(55)

తప్పులను ముప్పులను/
ముప్పులను చెప్పులను/
చెప్పులను మోయక శిరస్సుపై బాలకవి!/(56)


యజమానికి తోడై/
తోడు ఇంటికి నీడై/
నీడై కాపలా యుండును వేపి బాలకవి!(57)

చేతికి అందంగా/
అందమె బంధంగా/
బంధమై నాడీని కొలుచునది బాలకవి!/(58)



నింగిలో పక్షినై/
పక్షినై తారనై/
తారనై నవ్వాలని ఉన్నది కవనమా!(59)

గుండెలో రవళినై/
రవళినై నెమలినై/
నెమలినై పురి విప్పాలనుంది కవనమా/!(60)

నీటిలో మీనమై/
మీనమై కూర్మమై/
కూర్మమై ఈదాలని ఉన్నది కవనమా/!(61)

మేఘమున చినుకునై/
చినుకునై మెరుపునై/
మెరుపునై ఉరమాలని ఉన్నది కవనమా/!(62)

చెట్టులోనాకునై/
ఆకై కోయిలనై/
కోయిలనై పాడాలనున్నది కవనమా/!(63)

చెట్టుకే నీడనై/
నీడనై తోడునై/
తోడునై జగతిని హత్తుకుందు కవనమా/!(64)

చిరుతకు పోటీగా/
పోటీగ మేటిగా/
మేటిగా నిలవాలని ఉన్నది కవనమా/!(65)

గుడిలోన గంటనై/
గంటను దీపమునై/
దీపమై పూజించాలనుంది కవనమా!(66)

మనసే కవిత్వమై/
కవితే కపోతమై/
కపోతమై శాంతిని పరిచెదను నేస్తమా/!(67)

అక్షరాలు పుటలో/
పుట మైదానములో/
మైదానమునాడి కవితలయ్యె నేస్తమా/!(68)

గుడిలోని దీపమై/
దీపమై ధూపమై/
ధూపమై పరిమళించాలుంది కవనమా/!(69)

నోటిలో శాస్త్రమై/
శాస్త్రమై మంత్రమై/
మంత్రమే పలుకులే పూజారి నేస్తమా/!(70)

మేఘమే సరిగమై/
సరిగమే కవనమై/
కవనమే కురిసింది మదిలోన నేస్తమా/!(71)

చెట్టుకే పండునై/
పండునే పుండునై/
పుండునైతి రాళ్ల దెబ్బలతో నేస్తమా/!(72)

వాకిట్లొ ముగ్గులా/
ముగ్గులా చెట్టులా/
చెట్టులా బ్రతకాలని ఉన్నది కవనమా/!(73)

నెహ్రూ తనయి తాను/
తాను దేశమేలెను/
ఏలెను సమర్ధతో ఇందిరా నేస్తమా/!(74)

 

✍️ లిఖిత్ కుమార్ గోదా,

 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం

15.11.2020

14, నవంబర్ 2020, శనివారం

తరణం జాతీయ దినపత్రిక నిర్వహించిన "బాలలు భావి భారత పౌరులు" అనే అంశంపై నేను పంపిన సమ్మోహనాల లఘు కవితలు

 


తరణం జాతీయ దినపత్రిక


బాలల దినోత్సవం సందర్భంగా


బాలలు భావి భారత పౌరులు


           బాలలు సమ్మోహనాలు


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు కుమారా/!

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా/!

గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా/!

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలోలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/!

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును కుమారా/!

*లిఖిత్ కుమార్ గోదా*, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్, ఖమ్మం.
ఫోన్:- 9949618101.



10, నవంబర్ 2020, మంగళవారం

ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష

లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"






బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.


కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.


రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.


  గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు

బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.

      ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.


బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.

ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.


ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.


"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.

తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.


మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.

"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.


ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.

రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.

బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.


ప్రతులకు:- 

వేంపల్లి రెడ్డి నాగరాజు,

ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,

 రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269

మొబైల్:- 7989928459,9985612167.


నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)


పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.




హాయ్ నేస్తాలూ! ఎలా ఉన్నారు.నేను మీ మోనిస్.."లిఖిత్ కుమార్ గోదా"ని. నవంబర్ 14 న మన పండుగ సందర్భంగా మీకోసం మన నేస్తాలు రాసిన ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. పుస్తకం పేరేమిటో చెప్పనా? "నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు". మరి ఆ పుస్తకం విశేషాలేంటో చూద్దామా!

"అచ్చటికిచ్చటి కనుకోకుండా

 ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే

 ఈలలు వేస్తూ ఎగురుతుపోయే

 పిట్టల్లారా!

పిల్లల్లారా!!..."



 "శైశవగీతి"లో మహాకవి శ్రీశ్రీ కల్లా కపటం ఎరుగని బాలల గురించి చెప్పిన కవిత ఇది. నిజమే పిల్లలు పక్షుల లాంటివారు. ఏ చోటకైనా, ఎక్కడికైనా కేరింతలు పెడుతూ విహరించగలరు. వారు ఉన్నచోటునే పూదోటగా మలచగలరు. ఆనంద లోకాన్ని సృజించగలరు. బాలలు తలచుకుంటే నిండు మనసుతో ఏ పనైనా ఇట్టే ఆకళింపు చేసుకుని, ప్రీతితో చేయగలుగుతారు. అలా వారి అభిలాషకు అక్షరాల రంగులద్ది చక్కని ,చిక్కని కథలు రాశారు నల్లగొండ జిల్లా బడి పిల్లలు. అలా మన తుంటరులు రాసిన కథలను ప్రముఖ పరిశోధకులు, సంపాదకురాలు శ్రీమతి ఉప్పల పద్మ గారు భగీరథ దీక్షతో పుస్తకంగా మనముందుకు తీసుకువచ్చారు.

ఈ పుస్తకంలోని కథల గురించి చెప్పుకునే ముందు ఈ పుస్తకానికి ప్రాణం పోసేలా చేసిన బాల వదాన్యుడు చిరంజీవి శ్రీ రిషి వర్షిల్ నెలకుర్తి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
పుస్తక పఠనం ఆవశ్యకత తెలిసి, తన వయసులోని ప్రతిభావంతులైన పిల్లల్ని ప్రోత్సహించాలనే సత్సంకల్పం కలిగి, రాబోయే నవతరం ఉత్తములుగా ఎదగాలనే లక్ష్యంతో, తాను సేకరించిన, సంపాదించిన డబ్బుతో ఈ పుస్తకాన్ని మన అరచేతిలోకి వచ్చేలా చేశాడు. చిన్నతనంలోనే దానగుణాన్ని ఇముడ్చుకున్న రిషీ వర్షిల్ నేటి తరానికి ఆదర్శప్రాయం. ఈ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని సహాయం చేయదలుచుకున్న వారు ఎందరో ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. భావి తరాన్ని రంగవల్లులతో నింపాలి.

 నలభై ఐదు రత్నాలతో నిండిన ఈ పుస్తకం విజ్ఞాన కోశాగారం వంటిది. ప్రతి కథలో నీతిని, తాము చూసిన జీవితాలకు చక్కని అక్షర రూపాన్నిచ్చారు ఈ చిరంజీవులు. పిల్లలు ఎంత బాగా చేయి తిరిగిన రచయితల్లా కథలు రాశారో, అంతే బాగా చిత్రాలు గీశారు చిత్రకారులు. చిత్రకారుల బొమ్మలతోనే కథలు మనకు అర్థం అవుతూ ఉంటాయి.
ధీరావత్ భూమిక రాసిన" ఆడపిల్ల" కథ "ఆడపిల్లలపై ఇప్పటికీ జరుగుతున్న వివక్ష"పై రాసిన చక్కటి కథ. గంగ వాళ్ళ ఊర్లో ఒక దెయ్యం ఉండడం, ఆ దెయ్యం అందర్నీ భయపెడుతుందని ఊరి వాళ్ళు చెప్పుకుంటే గంగ వినడం, ఆ దెయ్యాన్ని చూడాలని ఒక రాత్రి కుతూహలంతో అడవికి వెళ్లి ఆ దెయ్యాన్ని కలవడం, ఆ దెయ్యం తానొక ఆడపిల్లనని. తన తల్లిదండ్రులకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చిన్నదైనా తనను చంపడంతో తాను దెయ్యం అయ్యానని చెప్పడం, ఆడపిల్లని ఎవరూ చంపకూడదనే సదుద్దేశంతో ఆ చుట్టుపక్కలే సంచరిస్తున్నాని చెప్పడం, ఆడపిల్లల్ని ఎవరిని చంపనివ్వకుండా నేను చూస్తాను అని గంగ హామీ ఇవ్వడం, గంగ ఊరి వారిని మార్చే ప్రయత్నం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

వట్టికోట గాయత్రి తన "అసలైన కొడుకు" కథలో. వర్తమాన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేసింది. కన్నవారినే కాదనుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో , తనకేమీ కానీ రాజవ్వకు కుండపోత వర్షం పడుతున్నప్పుడు రమేష్ ఆశ్రయం ఇవ్వడం, తనను కాదన్న కొడుకులు తనకోసం, తన ఆస్తి కోసం వచ్చినా, రాజవ్వ మాత్రం రమేష్ ని తన నిజమైన కొడుకు గా భావించడం పాఠకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.

"కొడుకైనా కూతురైనా ఒకటే" కథను తొమ్మిదో తరగతి విద్యార్థిని సుంకర ఉదయశ్రీ చాలా చక్కగా రచించింది.
"మట్టి గణపతి" కథలో పర్యావరణ హితాన్ని కోరి శ్రీవర్ధన్ మంచి కథను అందించాడు. నిజంగా ఇలాంటి మార్పులు పల్లె నుండి మొదలవడం ఆవశ్యకం.
"మార్పు" కథ భలే తమాషాగా సాగుతుంది. నిజంగా ఒక చెయ్యి తిరిగిన రచయితలా కథను లిఖించింది రమ్య చెల్లి. కథ చదువుతున్నంత సేపు కూడా పిసినారిని నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపడం, వైద్యుడు పిసినారిని గ్రహించి తెలివిగా వ్యవహరించడం, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అందరి మనసులను దోచుకుంటోంది.

పాటి భానుజ "స్నేహం గొప్పతనం", శ్రీవిజ"ఐక్యమత్యమే మహాబలం", భవాని "భయం కలిపిన స్నేహం", మరికొన్ని కథలు స్నేహం గొప్పతనాన్ని చాటుతాయి.
"ప్రాయశ్చిత్తం" కథను రాసిన వైష్ణవి సమకాలీన జీవితానికి అద్దం పట్టేలా రచించింది.

శివమణి "తెలివితక్కువ పని" కథను ప్రశంసించకుండా ఉండలేం. అంత చక్కని కథ.

పావని "చిన్నప్పుడే" కథ, సాహితీ "గురుదక్షిణ" కథలు చదువరులను ఆహ్లాదపరుస్తాయి. మంచి నైతికాలను అందిస్తాయి.
"కోటిలింగాలు" కథ రాసిన శ్రీకర్ చాలా చురుకైన ఆలోచనతో అతి జాగ్రత్త ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వివరించాడు.

"నాన్నా తాగకు", "మారిన మనిషి" మద్యపాన వ్యసనమున్న తండ్రులను ఎలా మారుస్తారో వివరించిన కథలు.
ఇలా చెప్పుకోవాలే కానీ, అన్ని బాల రచయితలు తమ స్థాయికి మించి సృజనకు పెద్దపీట వేశారని చెప్పుకోవాలి. అక్కడక్కడ కొందరు బాల రచయితలకు హృదయాల నిండుగా అమలిన ప్రోత్సాహం అందిస్తే సాహిత్యంలో తిరుగులేకుండా ఎదగగలరని నా అభిప్రాయం.

తెలుగు బాల సాహిత్య పుటల్లో ఇంతటి మహత్తర కరదీపికను ఎంతో దీక్షతో, శ్రమపడి వెలువరించిన సంపాదకురాలు ఉప్పల పద్మ గారికి అభినందనలు. అలాగే నవతరం నూతన రచయితలు చక్కని కథలు రాసినందుకు ఇవే నా శుభాభినందనలు. అలాగే అందరూ ఆదరించదగ్గ నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు వయ్యిని మన హృదయ గ్రంథాలయం లో పొందు పరచుకునేలా చేసిన, పాఠశాల ఉపాధ్యాయులు , సహకరించిన తల్లిదండ్రులు, చిరంజీవి రిషి వర్షిల్ అభినందనీయులు. 

            ✍️  పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

9, నవంబర్ 2020, సోమవారం

ప్రముఖ సాహితీవేత్త గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష

 సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు"(పుస్తక సమీక్ష-06)

మొలక న్యూస్ లో ప్రచురించిన నా పుస్తక సమీక్ష (09/11/2020)


పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు కవర్ పేజి




ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.


అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.


ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.


బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.


ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.


మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.


"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.


"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.


"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.


ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!

సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.htm





సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.html




📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒📒

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...