24, ఆగస్టు 2020, సోమవారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురితమైన నా 71వ రచన ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య (కవిత)


    ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య



తెలుగు సాహితీ కుటుంబ సదనంలో

అందమైన నవలా చక్రవర్తి

మన దాశరధి రంగాచార్యులు.

తెలంగాణ జన జీవనం, రైతాంగ పోరాట నేపథ్యాన్ని జీవ శక్తిగా మలచుకుని,

తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని

తన పదునైన దీటైన నవలలతో

మయసభలా చిత్రించిన కళావల్లభుడు.

వరదాచార్యులుచే "గద్య దాశరధి" అని

పేర్మితో పిలిపించుకున్న రతనాల సారధి.

"చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు,జనపదం

జీవనయానం, రానున్నది ఏది నిజం"

వంటి మహత్తర రచనలకు పురుడు పోసిన

తెలుగు సాహితీ తేజం మన రంగాచార్య.

నవల రచన చరిత్రలో

పాత్రోచిత యాసను ప్రవేశ పరిచిన మహా పురుషుడు.

అక్షరం మానవ రూపం దాల్చి

ఉద్యమిస్తే అది దాశరధి రంగాచార్యనే.

✍️లిఖిత్ కుమార్ గోదా

24.08.2020

71వ రచనా ప్రచురణ

27వ కవితా ప్రచురణ

మొలక న్యూస్ 

టి. వేదాంత సూరి గారు

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/3MkahM.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...