ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య
తెలుగు సాహితీ కుటుంబ సదనంలో
అందమైన నవలా చక్రవర్తి
మన దాశరధి రంగాచార్యులు.
తెలంగాణ జన జీవనం, రైతాంగ పోరాట నేపథ్యాన్ని జీవ శక్తిగా మలచుకుని,
తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని
తన పదునైన దీటైన నవలలతో
మయసభలా చిత్రించిన కళావల్లభుడు.
వరదాచార్యులుచే "గద్య దాశరధి" అని
పేర్మితో పిలిపించుకున్న రతనాల సారధి.
"చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు,జనపదం
జీవనయానం, రానున్నది ఏది నిజం"
వంటి మహత్తర రచనలకు పురుడు పోసిన
తెలుగు సాహితీ తేజం మన రంగాచార్య.
నవల రచన చరిత్రలో
పాత్రోచిత యాసను ప్రవేశ పరిచిన మహా పురుషుడు.
అక్షరం మానవ రూపం దాల్చి
ఉద్యమిస్తే అది దాశరధి రంగాచార్యనే.
✍️లిఖిత్ కుమార్ గోదా
24.08.2020
71వ రచనా ప్రచురణ
27వ కవితా ప్రచురణ
మొలక న్యూస్
టి. వేదాంత సూరి గారు
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/3MkahM.html
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి