16, జనవరి 2020, గురువారం

బాల చెలిమి చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రచురించ తలపించిన తెలంగాణ బడి పిల్లల కథలు ఖమ్మం జిల్లా ఎడిషన్ లో రాసిన నా 13వ బాలల కథ :రెండు కళ్లు ✍🏻✍🏻✍🏻🙏🏻🙏🏻🙏🏻

బాల చెలిమి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ సంపాదకులు, చైర్మన్ 
శ్రీ మణికొండ వేదకుమార్ గారి సారధ్యంలో, శ్రీ గరిపెల్లి అశోక్ గారు కన్వీనర్  గా నిలబడి వెలువరించి తెలంగాణ బడి పిల్లల కథలు, ఖమ్మం జిల్లా బడి పిల్లల కథల సంకలనంలో ప్రచురితమైన నా కథ రెండు ళ్ళు.
ఖమ్మం జిల్లా సంకలనకర్త శ్రీ డా.అమ్మిన శ్రీనివాస రాజు గారు






ఖమ్మం జిల్లా - బడి పిల్లల కథలు-2019

రెండు కళ్లు


బనిగండ్లపాడు గ్రామంలో యస్ఆర్ ఆర్ గవర్నమెంట్ పాఠశాల ఉంది అప్పుడే 10వ తరగతిలోకి అడుగుపెట్టారు, తెలుగు సార్ రత్న కుమార్ గారు విద్యార్థులకు "యక్షుడు, ధర్మరాజు” పాఠం పూర్తి చేసి “పిల్లలూ! చూసారా! పాఠంలో యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు చాలా చక్కగా సమాధానాలు చెప్పి, తన తమ్ముళ్లను ఎలా యక్షుడు నుండి కాపాడుకున్నాడో? ఇప్పుడు మీకో సవాల్ విసరబోతున్నాను అన్నారు


“ఏంటి సార్ అది?” "ఆత్రంగా అడిగారు విద్యార్థులందరూ ఇప్పుడు మీరు పాఠం విన్నారు కదా! ఒకవేళ ధర్మరాజు స్థానంలో మీరుండి, యమధర్మరాజు మీ తల్లిదండ్రులని స్పృహ కోల్పోయేలా చేసి, మిమ్మల్ని కూడా అలాగే ప్రశ్నలు అడిగి, ఒకవేళ మీరు అన్నింటికి సమాధానాలు చెప్పారనుకోండి.

అప్పుడు యమధర్మరాజు మిమ్మల్ని మెచ్చి, 'ప్రసన్నుడను అయ్యాను. నీ

తల్లిదండ్రులలో ఒకరిని బ్రతికించుకో!' అంటే, మీరు ఎవరిని బ్రతికించుకుంటారో ఒకొక్కరూ లేచి చెప్పండి అన్నారు షణ్ముఖ్ లేచి "ఇది కాస్త జటిలమైన ప్రశ్న సార్! అయినా జవాబు చెప్తాను నాకన్నీ మా అమ్మే, అడిగి మరీ తెలుసుకొని అవసరాలు తీరుస్తుంది. మానాన్న

ఎప్పుడో... అంతే! అందుకే నేను మా అమ్మని బ్రతికించమంటాను” అన్నాడు.

సందీప్ నిలబడి “సార్! నాకు మానాన్న క్రికెట్ బ్యాట్, సైకిల్ ఏదడిగినా ఇస్తాడు. మా అమ్మ వాటిని సహించేది కాదు. ఎప్పుడు చివాట్లు పెడుతుంది. అందుకే మా నాన్నని బ్రతికించమని ఆ యమధర్మరాజుని కోరుకుంటాను” అని కూర్చున్నాడు

ఇందు లేచి “సార్! మాది పేద కుటుంబం. ఎప్పుడు మా నాన్న తీరిక లేకుండా పనికి వెళ్లి మమ్మల్ని బ్రతికిస్తాడు. కాబట్టి మానాన్నని బ్రతికించుకుంటా” అంది.

త్రినాథ్ లేచి "సార్! నాకు ఇద్దరూ రెండు కళ్ళు లాంటివారు. అమ్మ ఇంట్లో కష్టపడుతుంది. నాన్న ఆఫీసులో కష్టపడతారు. ఇద్దరూ నాకోసమే కష్టపడతారు. ఇది కుదురుతుందో లేదో నాకు తెలీదు. కానీ నాకే అలాంటి స్థితి వస్తే మాత్రం నేను కుదిరితే ఇద్దరిని బ్రతికించమంటాను. కుదరకపోతే నన్ను కూడా వాళ్లతో పాటే తీసుకెళ్లమంటాను. అంతే... అమ్మా నాన్న లేకుండా బ్రతకడం కన్నా నరకం లేదా చావే మంచిది” అన్నాడు

రత్న కుమార్ గారు ఆనందంగా కరతాళాలు మ్రోగించారు నిశ్శబ్దంగా ఉన్న క్లాసులో

శభాష్! చాలా చక్కగా సమాధానం చెప్పావ్” అంటూనే మిగిలిన వారితో తల్లిదండ్రులు లేని జీవితం బ్రతికున్న శవం లాంటిది. అందుకే మనకు ఇద్దరూ కావాలి. అలాగని అమ్మ తిట్టింది అని. నాన్న కసురుకుంటున్నాడని ఒకరిపై ఇష్టం మరొకరిపై అయిష్టం ఉండకూడదు. సరేనా!” అన్నారు.

చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన త్రినాథ్ కి "నీతి కథలు" పుస్తకాన్ని బహుకరించారు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ తమ తప్పు తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. ఆ

-గోదా లిఖిత్ కుమార్, 10వ తరగతి బనిగండ్లపాడు, మధిర, ఖమ్మం జిల్లా

- ఖమ్మం జిల్లా - బడి పిల్లల కథలు-2019




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...