కథ పేరు :కిట్టు తెలివి
రచన : గోదా.లిఖిత్ కుమార్
బనిగండ్లపాడు అనే గ్రామంలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టు చాలా మంచి పిల్లవాడు. మంచిని తప్ప చెడును సహించలేనివాడు. ఆ ఊరిలోనే సునీత అనే ఆమెకు కిరాణా షాపు ఉంది. సునీత కల్తీ సరుకులు , ఎక్స్పైరీ అయిన చాక్లెట్, బిస్కెట్, కిరాణా సరుకులు అమ్మడం వంటివి చేసేది.
ఒక రోజు కిట్టు, తన చెల్లెలు కలిసి సునీత కిరాణాకి వెళ్లి చాక్లెట్లు,బిస్కెట్లు కొనుకున్నారు. ఇంటికి వెళ్తూ అవి ఓపెన్ చేసి చూస్తే బిస్కెట్లల్లో, చాక్లెట్లు లో పురుగులు ఉన్నాయి.
తిరిగివచ్చి''చాక్లెట్లు లో పురుగులు ఉన్నాయి ఆంటీ '' అన్నాడు కిట్టు.
'' మా చాక్లెట్లు లో పురుగులా? మేము నాణ్యమైన సరుకులు, తిను బండరాలు అమ్ముతాము. నువ్వు వాటిని కింద పడేసి ఉంటావు. ఏదో మాయ మాటలు చెప్పి మళ్లీ చాక్లెట్లు తీసుకుందామని ఇలా అబద్ధాలు చెబుతున్నావు. ఇలా చిన్న వయసులో అబద్ధాలు చెప్పకూడదు కిట్టు ''అని తన తప్పును వెనకేసుకొస్తూ మంచి మాటలు చెప్పినట్లు చెప్పింది సునీత.
ఆమె మోసాన్ని గ్రహించాడు కిట్టు. ఈ ఊరిలో ఆమె చేసే మోసాలు ఆపాలని అనుకుంటూ ముందుకు కదిలాడు కిట్టు.
అతని అదృష్టం కొద్దీ అక్కడ ఒక పాడైపోయిన బల్బు కనిపించింది. దాన్ని ఒక రాయితో పగల గొట్టాడు.
అది చూసిన సునీత ''చాలా గడసరి లా ఉన్నావే? అలా రోడ్డు మీద ఉన్న బల్బుని పగలగొట్టొచ్చా? అది తప్పు కదా? అవి ఎవరికైనా గుచ్చుకుంటే ప్రమాదం జరగదూ? అలా చేయకూడదు ''అని మంచిగా నీతిని చెబుతున్నట్టు వాపోయింది.
''అవునా ఆంటీ! మరి మీరు పాడైపోయిన చాక్లెట్లు, బిస్కెట్లు, వస్తువులు అమ్మితే మాత్రం అనారోగ్యం పాలవరా? ప్రమాదం జరగదా? మోసం చేయకండి ఆంటీ. మంచిగా కొట్టు నడపండి. ఎవరి అనారోగ్యానికి కారణం కాకండి. ''అని అన్నాడు కిట్టు.
సునీత తెల్ల ముఖం పెట్టింది.
రచన : గోదా. లిఖిత్ కుమార్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి