5, ఏప్రిల్ 2020, ఆదివారం

నా 15వ కథ చిట్టి చేప సమయస్ఫూర్తి బాలల కధ

నేటి మొలక న్యూస్ లో నా 15వ కథ  ''చిట్టి చేప సమయస్ఫూర్తి ''(బాలల కథ ) 


వేసవి సెలవులు కావడంతో చిన్నారి పొన్నారి బాలలంత తమ వీధిలోన ఉన్న పరంధామయ్య తాతయ్య దగ్గరికి వెళ్ళారు. పరంధామయ్య తాత విశ్రాంతి తెలుగు ఉపాధ్యాయుడు.వీధిలోని పిల్లలంతా కాలక్షేపం కోసం, ట్యూషన్ కోసం ఆయన ఇంటికి వచ్చే వాళ్ళు. పరంధామయ్య తాతయ్యకి పిల్లలు అంటే చాలా మక్కువ.పిల్లలు అంతా ఒక వానర మూకల తన ఇంటికి రావడంతో పరంధామయ్య తాత సంతోషించి అందరినీ తన ఇంటి అరుగు మీద కూర్చోమన్నాడు. తాను ఒక కుర్చీ పై ఆశీనుడయ్యాడు. ఆయన భార్య చేత అందరికీ మిఠాయిలు పంచాడు. గందరగోళంగా ఉన్న తరుణంలో మూక మధ్యలో ఉన్న మూడేళ్ల భరత్"తాత గాలు! ఒక చిట్టి కథ చెప్పలు!"అని తాను వచ్చీరాని మాటలతో ముద్దు గా అడిగాడు."అవునవును తాతగారు !ఖచ్చితంగా ఒక కథ చెప్పాల్సిందే" అంటూ పిల్లలందరూ హర్షధ్వానాలు చేశారు. పరంధామయ్యగారు చిరునవ్వు నవ్వి" సరే! పిల్లలు నిశ్శబ్దంగా వినండి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథ పేరు "చిట్టి చేప సమయస్ఫూర్తి". అనగనగా కృష్ణాపురం ఊరు దగ్గర ఒక చెరువు ఉండేది. ఒకరోజు ఒక బెస్తవాడు చేపలు పట్టడానికి అని ఆ చెరువు లో కి వెళ్ళి వల వేసాడు. కానీ చేపలు వలలో పడలేదు. కానీ అతని మనోధైర్యం వదలకుండా చాలాసార్లు ప్రయత్నించాడు. చిట్టి చివరికి అతని వల లో ఒక చిట్టి చేపపిల్ల పడింది.ఆ చిట్టి చేపపిల్ల ఆ బెస్తవా డికి దొరికేసరికి కంటనీరు పెట్టింది. ఏడుస్తూ " నన్ను వదిలేయ్"అని వేడుకుంది. "నిన్ను వదలడం ససేమిరా కుదరదు" అన్నాడు బెస్తవాడు. బెస్తవాడు ఆ చేప పిల్లని ఒక బుట్టలో వేసుకున్నాడు. దిగులుగా ఏడుస్తున్న ఆ చిట్టి చేప పిల్లకు మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది. వెంటనే బెస్త వాడితో"ఓ బెస్త వాడ! పాపం పొద్దున్నుంచి శ్రమ పెడుతున్నట్టు ఉన్నావు. నీ పట్టుదల చూస్తే నాకు ముచ్చట వేస్తుంది . నీకు చేపలే కదా కావాల్సింది. నన్ను వదిలేస్తే నీకు పెద్ద పెద్ద చేపల్ని పట్టిస్తాను. అప్పుడు నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్లొచ్చు. నన్ను నమ్ము"అంది. బెస్తవాడికి లోన ఆశ పుట్టి "నిజంగా పట్టిస్తావా?అబద్ధం చెప్పడం లేదు కదా" అని చిట్టి చేపతో అన్నాడు." నిజంగా నన్ను నమ్ము "అంది." సరే మరి నేను నమ్మి నిన్ను చెరువులోకి వదిలేస్తున్నాను నాకు పెద్ద చేపలు పట్టించు" అని చేప పిల్లని వదిలేశాడు. "త్వరగా వాటిని పట్టించు నేను ఇంటికి పోవాలి "అన్నాడు బెస్తవాడు తుర్రుమంటున్న ఆ చిట్టి చేప పిల్లబెస్తవాడితో "అబ్బా ఇంకా ఏమన్నా పట్టించ వద్దు. నేను నీ నుండి తప్పించుకోవాలని అలా అన్నాను .నేను నీకు అబద్ధం చెప్పాను.నా ప్రాణం కాపాడుకోవడానికి. మోస పోయావు గా. అయినా నా వాళ్ళను నేనెందుకు పట్టిస్తాను" అని నవ్వుతూ తుర్రుమంది. అని కథ చెప్పడం ముగించాడు పరంధామయ్య తాతయ్య.చూశారా పిల్లలు సమయస్ఫూర్తి ఆపదలో ఎలా ఉపయోగపడుతుందో మీరు కూడా సమయస్పూర్తి కలిగి మీ జీవితంలో ఆపదల నుంచి తప్పించుకోవాలి .అలాగే అవసరమైనప్పుడే అబద్ధం ఆడాాలి. అని సలహా ఇచ్చాడు. పిల్లలందరూ హర్షధ్వానాలు చేసి ఇంటికి వెళ్లారు. 

రచన:లిఖిత్ కుమార్ గోదా
 ఇంటర్ ఫస్టియర్ MJPTBCWR కళాశాల,బోనకల్
April 5, 2020 • T. VEDANTA SURY • Story

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...