11, ఏప్రిల్ 2020, శనివారం

నా 16వ బాలల కథ🦁🦁🦁 "ముందు పని..తరువాతే అందం"🦁🦁🦁 08/04/2020 మొలక ఆన్లైన్ మాగజైన్ లో ప్రచురితమైనది.

🦁🦁ముందు పని..తరువాతే అందం🦁🦁(బాలల కథ )

రచన: లిఖిత్ కుమార్ గోదా




        మొలక అనే చిట్టి అడవికి రాజు షేర్ సింగ్ అనే సింహం. అతనికి ఇద్దరు కవల మగ సింహాలు. ఒక సింహం పేరు కేశవ సింగ్ ఇంకో సింహం పేరు మాధవ్ సింగ్. షేర్ సింగ్ కి వయసు పైబడటం తో అడవికి రాజును ఎవరిని చేయాలా అని సందేహించసాగాడు. తన సందేహాన్ని మహామంత్రి టైగర్ ఖాన్ అనే పులికి విన్నవించాడు. టైగర్ ఖాన్ బాగా ఆలోచించి “మహారాజా! మీరు యువరాజుల లో ఉత్తముడి కోసం చూస్తున్నారు. రాజంటే పనికి ఎక్కువ విలువ ఇవ్వాలి. అంతేకాని అందాల కు లోబడి అడవికి చేటు చేయకూడదు. అందుకే యువరాజులు ఎవరికి పని మీద శ్రద్ధ ఎక్కువ ఉంది, ఎవరికి అందాల మీద ఎక్కువ మక్కువ ఉందో తెలుసుకోవడానికి రేపు ఒక పరీక్ష పెడదాం. అదేంటంటే ఇద్దరిని బంగారు చేపలు ఉన్న చెరువు వద్దకు వెళ్లి బంగారు కలువ పూలు తీసుకురమ్మని అండి. మార్గమధ్యలో అందమైన బొమ్మలు, నెమలి నాట్యాలు ఏర్పాటు చేయండి. ఎవరైతే అందాలను పట్టించుకోకుండా పని మీద శ్రద్ధ పెడుతూ కలువపూలు ముందుగా అడవిలోని రాజ్యసభకు తీసుకువస్తారో వారిని రాజుగా నియమించి మిగిలిన ఇంకొకరిని సైన్య అధ్యక్షుడిగా నియమించుదాం. ఇది నా మాట మహారాజా" అని చెప్పాడు.


షేర్ సింగ్ మహామంత్రి మాటలు అంగీకరిస్తూ మరుసటి రోజు అతను చెప్పినట్లు చేశాడు.

యువరాజు ఇద్దరికీ విషయం చెప్పి వారిని పోటీకి సిద్ధం కండి అని చెప్పాడు. యువరాజు లిద్దరు సంసిద్ధమయ్యారు. పోటీ ప్రారంభమైంది. కేశవ సింగ్, మాధవ్ సింగ్ ఇద్దరూ పరుగులు పెడుతున్నారు. మార్గమధ్యలో షేర్ సింగ్ ఏర్పాటు చేసిన నెమలి నాట్యం, అందమైన బొమ్మలు ఇద్దరూ చూశారు. కాకపోతే అవి కేశవ సింగ్ కళ్ళను ఆకర్షించాయి. అందమైన వర్ణాలు, నాట్యాలు కనబడిన ప్రతి చోటా తీక్షణంగా చూడసాగాడు కేశవ సింగ్.

                మాధవ్ సింగ్ ఇవేవి పట్టించుకోకుండా తన దారిలో తాను లీనమై బంగారు చేపల చెరువు దగ్గరకు వెళ్లి బంగారు కలువను తెంపుకొని ఇంకా మార్గమధ్యలోనే ఉన్న కేశవ సింగ్ ను చూసుకుంటూ రాజ సభకు చేరుకున్నాడు.

అందాలను తిలకిస్తూ వచ్చిన కేశవ్ సింగ్ చాలా ఆలస్యంగా బంగారు కలువ తెంపుకొని రాజ్య సభకు చేరుకున్నాడు.

                కేశవ సింగ్ రాజ్యసభ కు చేరుకున్న తర్వాత మంత్రి టైగర్ ఖాన్ “ మనకు కాబోయే మహారాజు మాధవ్ సింగ్ ” అని ప్రకటించాడు.తన ఆలస్యం, అందానికి లొంగిపోయే తత్వం వలన రాజ పదవిని వదులుకోవాల్సి వచ్చింది కేశవ సింగ్ కి.అందుకే సైనధ్యక్షుడిగా నియమితుడయ్యాడు కేశవ సింగ్.

అందుకే పెద్దలంటారు “ ముందు పని.. తరువాత అంద”మని.

👍 👍 డ్యూటీ ఫస్ట్... బ్యూటీ నెక్స్ట్.. 👍 👍

                              🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...