2, మే 2020, శనివారం

మొలక న్యూస్(02/05/2020) లో వచ్చిన నా 23వ బాలల కథ "మోసానికి తగిన శాస్తి"




కథ:మోసానికి తగిన శాస్తి(బాలల కథ)
రచన :లిఖిత్ కుమార్ గోదా
      నరేష్ గోపవరం అనే గ్రామంలో నివసిస్తున్నాడు. నరేష్ కథలు రాయడం మొదలుపెట్టాడు అప్పుడే.నరేష్ కథలు రాయడం వల్ల ఆ ఊర్లో అతనికి చాలా మంచి పేరు ఉంది. అందరూ అతన్ని అభినందించడం కాక ప్రోత్సహించే వారు కూడా. ఒక రోజు ఆ ఊరిలోనే ఉన్న ఒక పెద్ద రచయిత వేదాంత సూరి గారు నరేష్ దగ్గరకు వచ్చి "బాబు నరేష్! నువ్వు కథలు రాయడం మొదలుపెట్టావట. నువ్వు నీ భవిష్యత్తులో గొప్ప రచయితగా ఎదగాలంటే ఇప్పుడు రాసిన కథల్ని ఏదో ఒక దినపత్రికకో, వారపత్రికకో, మాసపత్రికకో, పంపించి చూడు. నీకు చాలా గొప్ప పేరు వస్తుంది."అని సలహా ఇచ్చాడు. నరేష్ వేదాంత సూరి గారు చెప్పినట్లే మూడు కథలు మంచివి ఎన్నుకొని వాటిలో రెండింటిని రెండు పత్రికలకు పంపి మూడో కథని ఓ సాహిత్య పోటీకి పంపగా దానికి ప్రథమ బహుమతి వచ్చింది. అలా తనకు ప్రథమ బహుమతి రావడం తో ఇక నరేష్ రచనలు వివిధ పత్రికలకు పంపుతూ ఎంతో కీర్తి పొందాడు. ఆ ఊరిలోనే రాకేష్ అనే పోస్ట్ ఆఫీస్లో పని చేసే వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు రాకేష్ నరేష్ కథని ఓ సాహిత్య పత్రికల్లో చూశాడు. ఆ కథ చాలా బాగా నచ్చింది అతనికి.
      ఆ కథ చదవగానే అతని మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. అదేంటంటే నరేష్ కథలు పంపించేటప్పుడు స్టాంప్ లెటర్ మీద వేసి తరువాత అతను వెళ్ళగానే దానిని చదివి తన పేరుతో పంపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఒకరోజు నరేష్ తన కథల కవర్ను రాకేష్ కి ఇచ్చాడు పోస్ట్ చేయడానికి. రాకేష్ ముద్ర వేసినట్టే వేసి నరేష్ వెళ్ళగానే దాన్ని తన బ్యాగ్ లో వేసుకున్నాడు. ఇంటికి వెళ్లి ఆ కథల కవర్ ని చింపి కథలు చదివాడు. ఆ కథలు చాలా బాగున్నాయి. సమాజ హితాన్ని కోరుతున్నాయి ఆ కథలు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా ఒక పోస్ట్ కవర్ తీసుకొని ఆ కథలన్నీ ఆ కవర్లో పెట్టి తన పేరుతో వేరే పత్రిక కి పంపించాడు. అవి ప్రచురించడమే కాక పత్రిక వారు రాకేష్ కి పారితోషికం కూడా ఇచ్చారు. అతనికి చాలా ఆనందం వేసింది. ఊరిలో ఆ కథలు చదివిన వారు రాకేష్ మీద అనుమానపడ్డారు. ఊరిలో అంతా అదే చర్చ సాగుతుంది. ఈ విషయం తెలియని నరేష్ తన కథల పడ్డాయని రోజు పేపర్లో చూసే వాడు. తన కథలు పడలేదని గమనించి పత్రిక వారిని సంప్రదించగా తమ పత్రికకి ఎటువంటి కథలు ఏమిరాలేదని వాళ్ళు చెప్పారు.తన మిత్రుడు శశి నరేష్ దగ్గరికి వచ్చి రాకేష్ పత్రికలో రాసిన కథలు చూపించాడు. అవి తన కథలే అని నిశ్చయించుకున్న నరేష్ రాకేష్ తనను మోసం చేశాడని గమనించాడు.రాకేష్ కి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి కొన్ని చెడు విషయాల పై కథలు ఆర్టికల్స్ రాసి మరుసటి రోజు రాకేష్కిచ్చి "రాకేష్ అన్నయ్యా! ఇవి చాలా జాగ్రత్త. ఇందులో చాలా మంచి కథలు ఉన్నాయి. నా కథలన్నీ జాగ్రత్తగా పంపించు" అని చెప్పాడు. నరేష్ కి తను చేసిన మోసం ఇంకా తెలియదులే అని అనుకున్నాడు రాకేష్. నరేష్ ఇంకా ఎలాంటి మంచి కథలు రాశాడో అని వాటిని చదవకుండానే ఒక కవర్లో పెట్టి తన పేరుతో పోస్ట్ చేశాడు. ఒక వారం తర్వాత రాకేశ్ ఇల్లు ఎక్కడ అని అందర్నీ విచారిస్తూ రాకేష్ ఇంటికి చేరుకున్నాడు ఓ జర్నలిస్టు.అందరూ రాకేష్ ఏ మంచి కథలు రాశాడో అని ఇంటిముందు గుంపు గూడారు. వచ్చిన వ్యక్తి రాకేష్ ని "ఏమిటయ్యా ఈ కథలు, ఆర్టికల్సు. వీడటిని చూస్తే ఎవరైనా జీవిస్తారా? అసలు నువ్వు మనిషివేనా? ఎట్లాంటి రచనలు చేసావో తెలుసా నీకు.?"అని తిట్టసాగాడు"అసలు సంగతి ఏంటండి?" అనే గుంపులో ఒకరు అడిగారు. "అతను రాసింది దొంగతనం ఎలా చేయాలి?, మనిషిని ఎలా చంపాలి? దేశాన్ని చెడు వైపు మార్చడం ఎలా? అనే విషయాలపై కథలు ఆర్టికల్స్ రాశాడు"అని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ జర్నలిస్టు మాటలు విన్నాక అయోమయంగా ఉన్న రాకేష్ కి అప్పుడు అర్థమైంది."ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని .ఒకరి టాలెంట్ ని మనది గా చేసుకొని మోసం చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటుందో"నని. అందరూ తననే తిడుతూ ఉంటే తలెత్తుకో లేకపోయాడు రాకేష్. ఇక ఎవరిని మోసం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఏదేమైనా నరేష్ తనకు తగిన శాస్తి చేశాడని అనుకున్నాడు. ఇక ఎప్పుడూ నరేష్ కథల్ని దొంగలించ లేదు. నరేష్ కథల్ని దగ్గరుండి పంపించాడు రాకేష్. ఇక ఎలాంటి అడ్డు గోడలు లేకపోవడంతో నరేష్ గొప్ప రచయితగా పేరు గాంచి ఎన్నో మహత్తర మైన రచనలు ప్రపంచానికి అందించి ఎన్నో బహుమతులు పొందాడు.
May 2, 2020 • T. VEDANTA SURY • Story

1 కామెంట్‌:

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...