18, జులై 2020, శనివారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక కోసం రాసిన కవిత

త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా కవిత

మనిషిని మలచేది మనసే..

3️⃣1️⃣/0️⃣7️⃣/2️⃣0️⃣2️⃣0️⃣

రచన:- లిఖిత్ కుమార్ గోదా

{22వ కవితా ప్రచురణ.

65వ రచనా ప్రచురణ}




______________________

ఒకరేమో దూర్వాస మహాముని,

ఇంకొకరేమో కుంతిదేవి,

ఒకరేమో కోపానికి మారుపేరు,

ఇంకొకరేమో శాంతికి ఉదాహరణ

మనిషిని మలిచేది మనసే.


ఒకరేమో రాజు రుక్మి

ఇంకొకరేమో కర్ణుడు

ఒకరేమో గొప్పల రాజు

ఇంకొకరేమో దానాల రాజు

మనిషిని మలిచేది మనసే.


ఒకరేమో వాలి

ఇంకొకరేమో సుగ్రీవుడు

ఒకరేమో అహంకారి

ఇంకొకరేమో అమాయకుడు

వారి మనసులను మలిచింది మనసే.


ఒకరేమో ధర్మరాజు

ఇంకొకరేమో దుర్యోధనుడు

ఒకరేమో సత్యమార్గంలో నడిచాడు

ఇంకొకరేమో కయ్యానికి సిద్ధపడ్డారు

మనిషిని మలిచేది మనసే.

3️⃣1️⃣/0️⃣7️⃣/2️⃣0️⃣2️⃣0️⃣


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...