26, ఆగస్టు 2020, బుధవారం

కరోనా పై కవితలు సంకలనం కోసం మహమ్మద్ రఫీ (ఈ-వేమన) గారి ఆహ్వానం మేరకు రాసిన కవిత ఇది.

   ఘరానా కరోనాకు              చరమగీతం..

లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507204.



__________________________


కాటేస్తున్న కరోనాను కోరలు పీకి కదలాలి

జన చైతన్యం పొందితేనే కరోనాని జయించేది,

నిద్ర లేచింది మొదలు నిద్ర లోకి జారు వరకు

జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని పడగొట్టినట్లే.

వేడి నీళ్లు తాగవోయ్ విపరీతంగా

కరోనాని మూడు చెరువులు నీళ్లు తాగించు.

సబ్బుతోన చేయి కలిపి కడుగు చేతిలెప్పుడు

కరోనాకు కన్నీరు తెప్పించు.

నిరంతరం పట్టుకోవాలి ఆవిరి

కోవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి.

బయటకు వెళుతున్న తరుణంలో మాస్కు పెట్టు ముఖానికి

కరోనాకి గోడ కట్టి కట్టిపెట్టు.

సామాజిక దూరం పాటించు

దుష్టులకు దూరంగా ఉండినట్లు.

వేరే వ్యాక్సిన్ వచ్చేదాకా ఆగడం ఎందుకు?

మేలు జరుగును చూడు

పూర్వీకులు సూచించిన జాగ్రత్తలు ఆచరిస్తే.

కరోనా సోకిన వ్యక్తికి

మానవత్వంతో బాసటగా నిలువు.

విధించిన షరతులను తూచా తప్పకుండా పాటిస్తే

ప్రతి మనిషీ కరోనాని జయించినట్లే

చరమగీతం పాడి కరోనాని తరిమితరిమి కొట్టినట్లే.


_________________


చిరునామా:- 


బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202

ఫోన్:- 9949618101


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...