21, సెప్టెంబర్ 2020, సోమవారం

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగరం వారు నిర్వహిస్తున్న గాంధీ 151 జయంతి వేడుకలు సందర్భంగా ఆ సంకలనం కోసం రాసిన మణిపూసలు. ప్రశంసా పత్రం కూడా పొందాను

 


పొందిన ప్రశంసా పత్రం 👆👆👆

        జాతిపిత మహాత్మాగాంధీ (మణిపూసలు) 



పోర్బందర్లో పుట్టెను

పుతలీబాయి తరించెను

చిట్టి గాంధీని చూసి

కరంచంద్ కళ్లు మురిసెను!


బోసి నవ్వుల తాత

రాసెను చక్కని రాత

మహాత్ముని కథ తెలుసుకుని

చాటుము అతని ఘనత!


సత్యశోధన ఆత్మకథ

ఆదర్శం ఆయని కథ

అలుపే లేని నడకతో

సృజించెను నూతన గాథ!


స్వచ్చభారత్ నాశించె

సువర్ణమైన మది గలిగె

ఫలితమేమీ కోరకా

స్వరాజ్యాన్నే అందించె!


కవి:- లిఖిత్ కుమార్ గోదా

ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం- 507202

చరవాణి:- 9949618101

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...