30, అక్టోబర్ 2020, శుక్రవారం

సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియలో పోటీ..

 సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్(కవితాలయం) లో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియ కవిత పోటీలో తొలి ప్రయత్నంగా పాల్గొన్నందుకు వారిలో నేను కూడా ఒక విజేతను అయ్యినందుకు సంతోషంగా ఉంది ❤️❤️

ఆత్మీయులు సాయి రమణి అక్కకి ధన్యవాదాలు 🙏🙏
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
పదబాణీ-2
శీర్షిక:- చినుకు సంబరం

నలుపు
నైలాలు
నైనాలు
నవ్వులు
నారీల
నాట్యాలు.

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం..
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.
ఫోన్:-9949618101

12.10.20202)

పదబాణీ-2

శీర్షిక:- మద్యపు మత్తు..
🌱🌱🌱🌱🌱
మహిలో
మనిషి
మారడా
మద్యపు
మత్తులో
మునిగి!
🌿🌿🌿🌿🌿🌿
✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202
ఫోన్:- 9949618101
🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️
#బాటసారులకు నమస్కారం 🙏.

#పదబాణీ -1వ కవితాపోటీని విజయవంతం చేసిన ప్రతి బాటసారికీ ప్రత్యేకంగా ధన్యవాదములు🌹🎉.

#నూతన విధానమైననూ మీరందించిన ప్రోత్సాహం, కార్యక్రమాన్ని నడపడానికి కావాల్సిన అభిమానం అందజేసిందనడంలో ఎలాంటి సందేహం లేనే లేదు. 
ఈ ప్రయత్నాన్ని ఇలాగే విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. 
ఇక 
#విభిన్న కోణాలలో మీరందించిన
#పదబాణీలలో 
#మాకు ఉన్న పరిమిత పరిజ్ఞానంతో క్రింద కనబరిచిన పదబాణీలను #విజేతలను ఎన్నుకోవటం జరిగింది 
నిజం చెప్పాలి అంటే అందరూ అద్భుతంగా రాసారు 
విజేతలను ఎన్నుకోవాలి కాబట్టి ప్రకటిస్తున్నాము .
చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల #కొద్దిమంది విజేతలుగా నిలవలేకపోయారు. 
ఇక విజేతల వివరాలకు వస్తే 
#పదబాణీల విజేతలు.. 
పదబాణి -2విజేతలు
1.NRK. రాజు గారు 
2.సంతోషి సన్నిధి గారు 
3.జానపాటి. మహాలక్ష్మి గారు 
4.లక్ష్మీ సుధా దేవి గారు 
5.లిఖిత్ కుమార్ గోదా గారు 
6.లిలిత చిట్టే గారు 
7.డాక్టర్ అహల్య మరుదాడు గారు 
8.జ్యోతి మువ్వల గారు 
 9.శ్రీ సూర్య గారు 
10.శ్రీతరం బింగి శ్రీకాంత్ గారు 
#అందరికి విజయ శుభాభినందనలు
#సమీక్షలు...
#NRK. రాజు గారు 
కష్టాలు కన్నీళ్లు కొన్నాల్లె అంటూనే కడలి కన్నీళ్లు కాస్సెపే అంటూ చెప్పె విధానము అద్భుతంగా ఉందండి. అభినందనలు
#సంతోషి సన్నిధి గారు 
నిశిలోను, నీడలోను నడక లోను తోడు ఉండే నా నవ్వు అని సుందర భావనలతో అద్భుతంగా వర్ణించే భావన బాగుందండి.అభినందనలు 
#జనపాటి. మహాలక్ష్మి గారు 
మగువ మనస్సు మేలైన మమత మాణిక్యం అంటూ మగువ మనస్సును మాణిక్యంతో పోల్చటం బాగుందండి. అభినందనలు 
#లక్ష్మి సుధా దేవి గారు 
కమ్మని కలలు కవ్విoచే కోమలి కన్నుల్లో అంటూ కలలను కమ్మదనంతో పోలుస్తూనే కోమలి కన్నులును జత చేయడం బాగుందండి.అభినందనలు 
#లిఖిత్ కుమార్ గోదా గారు 
మనిషి మద్యపు మత్తులో పడి మారడా అంటూ ప్రశ్నించే తత్త్వం బాగుంది చిన్న వయస్సులోనే మీరు సాహిత్యంపై అభిమానం చూపిస్తూ అద్భుతపదజాలం ఉపయోగించే తీరు బాగుందండి. అభినందనలు 
#లలిత చిట్టే గారు 
మది యొక్క మెత్తదనం చెబుతూనే మ్రోగింది మధుర మంజీరం అని చెప్పె విధానం బాగుందండి.అభినందనలు 
#డాక్టర్. అహల్యా మరుదాడు గారు 
సింధూరం, సౌశీల్యం సౌభాగ్యం సతికి ఉండాలి అని చెప్పటం బాగుందండి.అభినందనలు 
#జ్యోతి మువ్వల గారు 
మదిలో మగని మమత దాగుందని చెబుతూ మేడలో మాంగళ్య బంధం ఉందని చెప్పటం బాగుందండి.అభినందనలు 
#శ్రీ సూర్య గారు 
సృష్టిలో సహనం, సంస్కారంతో, సౌశీల్యంతో మెలగటం అసలైన సిరులు పంట అనటం బాగుందండి. అభినందనలు 
#శ్రీతరం బింగి శ్రీకాంత్ గారు 
కలువ కన్నులతో పోలుస్తూ కమనీయ దృశ్య కావ్యంతో చెప్పడం బాగుందండి. అభినందనలు 

మీ ఆత్మీయ సోదరి 
కుమారి చెన్నా. సాయిరమణి 
కవితాలయం 
ధన్యవాదములు 🙏🙏🙏

విజేతల ప్రకటన




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...