14, నవంబర్ 2020, శనివారం

తరణం జాతీయ దినపత్రిక నిర్వహించిన "బాలలు భావి భారత పౌరులు" అనే అంశంపై నేను పంపిన సమ్మోహనాల లఘు కవితలు

 


తరణం జాతీయ దినపత్రిక


బాలల దినోత్సవం సందర్భంగా


బాలలు భావి భారత పౌరులు


           బాలలు సమ్మోహనాలు


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు కుమారా/!

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా/!

గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా/!

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలోలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/!

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును కుమారా/!

*లిఖిత్ కుమార్ గోదా*, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్, ఖమ్మం.
ఫోన్:- 9949618101.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...