27, నవంబర్ 2020, శుక్రవారం

ఆత్మీయులు, గురువులు శ్రీ పోతగాని సత్యనారాయణ గారు, దేవయ్య యనుగందల గారు నేర్పించిన రుబాయిలు తొలి ప్రయత్నంగా...

 రుబాయీలు

రుభాయీలో నాలుగు పాదాలుంటాయి.

మూడవ పాదానికి తప్ప మిగతా పాదాలకు ఖాఫియా,రదీఫ్ లను పాటించాలి. లేదా అంత్యప్రాసతోనైనా రాయవచ్చు. 

ప్రతిపాదంలోనూ సమానమైన మాత్రల సంఖ్య ఉండాలి.
అయితే అత్యధికంగా ఇరవై తొమ్మిది మాత్రలకు మించకుండా,తక్కువలో తక్కువ పదిహేను మాత్రలకు తగ్గకుండా ఉంటే మంచిది.


నాకోసం నేనైతే కవిత్వాన్ని రాయలేను
నాలోకం వేరంటూ జీవితాన్ని గడపలేను
ఒక్కరోజు కవి లాగా జీవించాలని ఉన్నది
అక్షరాలే పేర్చి నేను తవికల్ని రాయలేను!(01)


అవ్యాజపు కన్నులతో నవ్వేది బాల్యమే
నేలమీద గీతగీసి ఆడేది బాల్యమే
ఇసుకతోన భవనాలను నిర్మించే పాపలు
వయస్సు పెరిగే కొద్దీ తరిగేది బాల్యమే!(02)

కథల్లో సద్గుణాలు వెతుక్కునే వయసది
దుష్ట కార్యాలను చీదరించుకునే వయసది
చెట్టు పైన కపిలాగ ఆటలాడు నేస్తాలు
ప్రేమానురాగాలను పెంచుకునే వయసది!(03)

కోవెలలో కంచురవళి పసి మనసుల నవ్వులు
తోటలోన పరిమళించు పొన్నారుల నవ్వులు
శక్తి లేని ముదుసళ్ళు కోరేదీ బాల్యమే
జగతినే మోహనపరుచు చిన్నారుల నవ్వులు!!(04)

లిఖిత్ కుమార్ గోదా.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...