15, జనవరి 2020, బుధవారం

బాల భారతం పిల్లల మాసపత్రిక (డిసెంబర్ 2016) సంచికలో పిలుపు కథలలో ప్రచురితమైన నా తొలి కథా రచన"హరితహారం"







హరితహారం


హను అనే కోతికి ప్రకృతి అన్న ,మొక్కలు అన్న ఇష్టం. ఇంటి చుట్టూ, పెరట్లో నూ పూల మొక్కలు పెంచేది. ఓ రోజు వర్షం పడుతుండగా నక్క గొడుగు వేసుకుని ఫోన్లో మాట్లాడుకుంటూ అటువైపు వచ్చింది. “ఏంటి హను ” ఇలా తడుస్తూ ముక్కలు నాటక పోతే నేమ్? అని ప్రశ్నించింది. అయ్యో నక్క బావా! ఇప్పుడు మొక్కలు నాటితే కొన్నాళ్ళకు అవి పెరిగి పెద్ద చెట్ల అవుతాయి. మనకు రక్షణ, నివాసం, సంపద కలిగిస్తాయి. చెట్లు జీవులకు ప్రాణవాయువు అందిస్తాయి. అలాగే తినడానికి పళ్ళు, పూలు, కలపను అందిస్తాయి. విడమరచి చెప్పింది కోతి. ఇంతలో అటు పోతున్న పోలీస్ ఎలుగుబంటి వీళ్ళను చూసింది . కోతి మాటలు దానిలో స్ఫూర్తి కలిగించాయి.

ఇకమీదట మొక్కలు పెంచాలని నిర్ణయించుకుంది. నక్క, ఎలుగుబంటి కోసం వేచి ఉన్నాయి అడవిలో మొక్కలు నాటి చెట్లను కాపాడతామని మాట ఇచ్చాయి. ఆ మాటలకు హను “మా అడవంతా పచ్చదనంతో నిండబోతోందోచ్"- అంటూ వానలో చిందేసింది.



                   *********************
      
        సేకరణ: బాల భారతం పత్రిక
                   డిసెంబరు 2016
     రచయిత: లిఖిత్ కుమార్ గోదా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...