16, ఏప్రిల్ 2020, గురువారం

నా 17వ బాలల కథ

స్వేచ్ఛ కోరిన రచయిత
రచన: లిఖిత్ కుమార్ గోదా

వేదాంత్ ఓ కథ రచయిత. చక్కని పిల్లల కథలు రాస్తూ అందరి మన్ననలు పొందేవాడు. తాను రాసే ప్రతి అక్షరాన్ని అనుసరించడం వేదాంత్ కి అలవాటు. ఒక కథను రాయాలనుకున్నాడంటే అది తన వ్యక్తిత్వాన్ని బట్టి తనకు ఆ గుణం, లక్షణం, మాటతీరు ఉంటేనే ఆ కథను చక్కగా అల్ల గలుగుతాడు. ఒక సారి తను రాసిన కథను బాలల కథల పోటీకి పంపగా అది ప్రధమ బహుమతిని పొందింది. బహుమాన ప్రధానోత్సవానికి హాజరయి, బహుమతి అందుకుని మిగతా రచయితలు, కవుల తో ముచ్చటించి తిరిగి కారులో పయనమయ్యాడు. కొంతమంది రచయితలు ఆయనతోపాటు ఉన్నారు. తోటి రచయితలు తమ కథల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. వేదాంత్ కూడా తన కథల గురించి ముచ్చటిస్తూ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న ఓ చిలకల వ్యాపారి నీ చూసి డ్రైవర్ తో “ డ్రైవర్ గారు కారును ఆపండి” అని అడిగాడు. డ్రైవర్ "సరే సార్" అంటూ ఆ చిలకల వ్యాపారి దగ్గర ఆపాడు. వేదాంత కారు దిగి చిలకల వ్యాపారి వద్దకు వెళ్లి “ఈ చిలకలు అమ్ముతారా!” అని అడిగాడు. “ అవునండి” బదులిచ్చాడు చిలకల వ్యాపారి. “ మొత్తం ఎన్ని చిలుకలు ఉన్నాయి?” అని అడిగాడు వేదాంత్. “ మొత్తం పన్నెండు ఉన్నాయి సార్” అన్నాడు చిలకల వ్యాపారి.



 “అన్నిటినీ కలిపి ఎంతకి ఇస్తారు” అని అడిగాడు వేదాంత్. “ అన్ని కొంటారా?” అని అడిగాడు చిలుకల వ్యాపారి. “ అవునండి బదులిచ్చాడు” వేదాంత్. “ ఒక చిలక వంద రూపాయలు అండి. మొత్తం పన్నెండు ఉన్నాయి కాబట్టి మొత్తం పన్నెండు వందలు అవుతాయి. అందులో మొత్తం అన్ని చిలుకల్ని తీసుకుంటా అన్నారు కాబట్టి రెండొందల తగ్గించి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకోండి” అన్నాడు చిలకల వ్యాపారి. సరేనని చెప్పి పర్స్ లోంచి వెయ్యి రూపాయలు తీసి ఇచ్చి చిలకల వ్యాపారం నుండి చిలకల తీసుకుని తీసుకున్నాడు. కార్ లో ఉన్న కవి భూషణ్ “వేదాంత్! జంతు ప్రేమికుడు లా ఉన్నావ్ ఇంట్లో ఏమన్న పెంచుకుందాం అనుకుంటున్నావా?” అని ప్రశ్నించాడు “భూషణ్ అన్నా! అదేం కాదు. వీటిని వదిలేయడానికి" అని చెప్పి చిలుకలు అన్నింటిని పంజరం లోంచి బయటకు తీసి వదిలేశాడు తరువాత వచ్చి కారులో కూర్చున్నాడు వేదాంత్. “అదేంటి వేదాంత్! వెయ్యి రూపాయలు పెట్టి కొన్న చిలుకల్ని ఇంటికి తెచ్చుకోకుండా అలా వదిలేసావ్ ఏం?” అని అడిగాడు నవ్వుకుంటూ సూర్య. “ అదేం లేదండి! నేను పోయిన వారంలో మూన్ అనే పత్రికలో "స్వేచ్ఛ" అనే కథ రాశాను. అందులో 'ప్రతి జీవి స్వేచ్ఛ కోరుకుంటుంది'అన్న నీతిని రాశాను. దానికి నాకు పారితోషికం 500 వచ్చాయి. నాకు తీసుకున్న రూపాయికి, రాసిన అక్షరానికి న్యాయం చేయడం అలవాటు అందుకే ఆ చిలకలు అలా పంజరంలో ఉండడం చూసి వాటికి ఇలా స్వేచ్ఛను కల్పించాను. అయినా ఇది మంచి పనే కదా” అని వివరించాడు వేదాంత్. “అవునవును రాసిన అక్షరాన్ని ప్రచారం తప్ప ఆచరించ లేకుండా ఉన్న రచయితలు, కవులు మాలాగా చాలామంది ఉన్నారు. నువ్వు నిజంగా “ నిజమైన రచయిత ”వి రాసిన ప్రతి అక్షరాన్ని, కథని, కవితను ముందు మనము నమ్మి, ఆచరించి చెప్పాలని, మంచి చెప్పే వాడు మంచివాడు అయితేనే ఆ మాట నిలుస్తుందని, అందరూ వింటారని మాకు తెలిసొచ్చేలా మాకు ఒక రకంగా గాంధీ కథను గుర్తు చేసి మా కళ్ళు తెరిపించి మా మార్పుకు కారణం అయిన నీకు కృతజ్ఞతలు” అని అన్నాడు శేషేంద్ర. అందరూ వేదాంత్ నీ అభినందించారు. అందరూ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కథారచన: లిఖిత్ కుమార్ గోదా
April 12, 2020 • T. VEDANTA SURY • Story





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...