16, ఏప్రిల్ 2020, గురువారం

నా 18వ బాలల కథ.

తిండిబోతు దెయ్యం..తెలివైన రాజు(బాలల కథ)
రచన:లిఖిత్ కుమార్ గోదా




   

         వామకుంట్ల అనే మారుమూల గ్రామం దాటితే ఒక అడవి ఉంది. ఆ అడవికి మాన్ సింగ్ అనే సింహం రాజు. జంతువుల అన్నింటిని న్యాయంగా పరిపాలిస్తూ అందరి మన్ననలు పొందాడు. అడివి నెప్పుడు సంరక్షించడంలో కీలక నిర్ణయం తీసుకునే వాడు మాన్ సింగ్.

ఒకసారి ఒక దెయ్యం తన చుట్టాలింటికి నుండి ఇంటికి అడివి మీదుగా వెళ్ళ సాగింది. అది తిండిబోతు దెయ్యం. అది ఎగురుతూ వెళ్లే సమయంలో అడవిలో అన్ని జంతువులూ కమ్మగా వంటలు వండు కుంటూ ఉన్నాయి. అది అసలే తిండిబోతు దెయ్యం కదా! అందుకే నోరూరి, నేతి గారెలు చేసుకుంటున్న నక్క ఇంట్లోకి దూరి “ఓయి నక్క బావ గుమగుమలాడే నేతి గారెలు చేసుకుంటున్నట్లున్నావు. రుచి చూస్తా ఆగు!” అని నేతిగారెలన్నీ ఒక్కసారిగా నోట్లో వేసుకుని వికారంగా నములుతూ “అబ్బా నక్క బావా! చాలా చక్కగా చేశావు ఎంతో రుచిగా ఉన్నాయి ” అని వికటంగా నవ్వుకుంటూ ఎగిరిపోయింది. నక్క తను చేసుకున్న నేతి గారెలు దెయ్యం తినడం చూసి తిండిబోతు దెయ్యం కి భయపడి రాజు మాన్ సింగ్ కి ఫిర్యాదు చేయడానికి అని బయలుదేరింది. దారిలో నక్కకి నెమలి, ఏనుగు, లేడీ కూడా కనిపించి తమ ఇంట్లోకి తిండిపోతు దెయ్యం వచ్చి తమ వంటకాలు తినేసింది అని ఈ విషయం రాజు కి ఫిర్యాదు చేయడానికి వెళుతున్నాం అని చెప్పగా తాను కూడా అదే పనిలో వెళుతున్నానని చెప్పి , అన్ని కలిసికట్టుగా రాజు మాన్ సింగ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాయి.
    
     రాజు మాన్సింగ్ కి ఏనుగు ఇంకో విషయం చెప్పింది.

 “మహారాజ! ఆ తిండిపోతు దెయ్యం మన అడవిలోనే, మీ ఇంటికి దగ్గరలోనే ఉన్న మర్రి చెట్టు పై నివాసం ఉంటానని ప్రతిరోజు భోజనాన్ని, వంటకాల్ని తినేస్తా అని నాతో చెప్పింది” అని చెప్పింది.
మాన్సింగ్ కి ఏం చేయాలో అంతు పట్టడం లేదు. రోజురోజుకీ తిండిబోతు దెయ్యం బెడద చాలా ఎక్కువైంది. ఆ తిండిపోతు దెయ్యం వల్ల జంతువులు అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నాయి. తిండిపోతు దెయ్యం ని ఎలా అడివి నుండి తరిమి కొట్టాలని ఒక పథకాన్ని ఆలోచించాడు రాజు మాన్సింగ్.
వెంటనే జంతువుల అన్నింటిని సభకు హాజరు కావాల్సిందిగా చాటింపు వేయించింది.

 జంతువులన్నీ వచ్చాక “నా ప్రియమైన వన జీవుల రా! గత కొన్ని రోజులుగా తిండిపోతు దెయ్యం సమస్య వచ్చింది. ఆ తిండిబోతు దెయ్యం వల్ల మన అడవిలోని జంతువులన్నీ బాగా ఆకలికి మాడి చాలా బాధ పడ్డాయి. ఆ దెయ్యాన్ని తరిమి కొట్టడానికి నేను ఒక ఉపాయం ఆలోచించాను. అదేంటంటే ఈరోజు అన్ని జంతువులు విపరీతమైన కారం తో వంటకాలు చేయండి. ఈ రాత్రి అందరం కలిసి అడవి పండుగ అని చెప్పి దెయ్యానికి ఈ భోజనం పెట్టి అడవి నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం” అని చెప్పింది. జంతువులన్నీ కూడా రాజాజ్ఞను సమ్మతించి మాన్ సింగ్ చెప్పినట్లుగా కారం తో వండిన వంటకాలు తయారు చేసి సాయంత్రం లోపు అన్ని జంతువులు వండుకొని రాజు మాన్ సింగ్ తో కలిసి బాణాసంచా పేలుస్తూ మర్రి చెట్టు దగ్గర కెళ్ళి
“ఓ భూత రాజా! ఒక్కసారి కిందకి రా” అని మాన్ సింగ్. 
 తిండిబోతు దెయ్యం క్రిందకి దిగి “ఏంటి సింహం బాబాయ్ సంగతి” అని అడిగింది.
“భూత రాజా! నువ్వు మా అడవికి అతిథి అనుకో. ఈరోజు మా అడివి పండుగ కాబట్టి మా వన పరివారం సంకల్పించిన ఈ విందు ను తిని మమ్మల్ని సంతృప్తిపరచగలవు. రా వచ్చి తిను” అని సాదరంగా ఆహ్వానించాడు మాన్సింగ్.
జంతువుల హడావుడి చూస్తే నమ్మబుధ్ధైంది తిండిబోతు దెయ్యానికి.

     ముందు కనులవిందుగా భోజనం ఉండటం చూసి తిండిబోతు దెయ్యం ఆనందించి “అవునా రాజా! సంతోషం” అని చెప్పి ఒక్కసారిగా భోజనాన్ని గుటుక్కు గుటుక్కున తినేసింది.
భోజనాలు వంటకాలు అంతా కారం తో చేయడంతో తిండిబోతు దెయ్యం కి కడుపులో బాగా మండి ఆ మంట భరించలేక పరుగులు పెట్టి నీటి కోసం వెతుకుతూ వెతుకుతూ అడివి నుండి వెళ్ళిపోయింది. జంతువులన్నీ రాజు మాన్సింగ్ తెలివికి అందించాయి. తిండిబోతు దెయ్యం పీడ విరగడవడంతో అన్ని సంబరపడిపోయాయి. మరెన్నడూ తిండిపోతు దెయ్యం ఆ అడవి వైపు చూడలేదు.

 కథారచన: లిఖిత్ కుమార్ గోదా
Molaka online magazine

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...