[తరణం దినపత్రిక లో ప్రచురించిన నా కవిత (28/06/2020)]
రచన:- లిఖిత్ కుమార్ గోదా
శీర్షిక:-మదిలో విషాద విపినం
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
మనసులోన ముసురుకున్న విషాద విపినం ఏదో?
ఎదలో నుండి ఎగిరిపోని బాధలేంటో?
మదిలోన ఉద్భవిస్తున్న శోకసంద్రంలేంటో?
మనసులోన శోకాన్ని
మాన్పడానికి వచ్చే మిత్రులు ఎవరో?
నేత్రాల నుండి జాలువారే శోకసంద్రాన్ని
తుడిచివేసే చూపుడువేలేదో?
సర్ది చెప్పే సన్నిహితుడు ఎవరో?
నాకైతే అంతుపట్టడం లేదు.
నేను ఎదురు చూడాలి,
అందరూ నా వాళ్ళేలే అని
కదంబ హస్తాలతో చేర్చుకునేవాడు
ఈ జగతిలో ఏకాకేనా?
ఎడదలో కల్మషం లేకుండా కలిసిపోదామనుకుంటే,
కపట బుద్ధిగలవారు కలవనీయరంతేనా?
ఈ లోకం,
కల్మషం లేనివాడిని నమ్మదు,
అక్కున చేర్చుకోలేదు,
కమ్మని ఊసులు పంచుదామనుకుంటే
కన్నెర్ర చేస్తుందీ కపట లోకం.
నా వ్యధే నిజమైతే
ఆ దేవుడే నా బాధను బాపునులే
నన్ను స్వచ్ఛమైన ప్రపంచం వైపు నడిపించునులే!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇
https://tharanam.net/మదిలో-విషాద-విపినం-లిఖిత/
చిత్రాలు 👇👇👇
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి